మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. డి వి వి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారమరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి చరణ్ వీడియో టీజర్ రిలీజై సంచలనం సృష్ఠించింది. గతంలో రాజమౌళి చరణ్ తో మగధీర తెరకెక్కించి రికార్డ్ స్థాయిలో సక్సస్ ను అందుకున్నాడు. ఇప్పుడు ఈ భారీ మల్టీ స్టారర్ పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కుతుండటంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. 

 

అయితే ఈ సినిమా తర్వాత చరణ్ ఏ సినిమాలో నటిస్తాడో.. దర్శకుడెవరో ..? సస్పెన్స్ గా ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం చరణ్ కి ధృవ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే చరణ్ సురేందర్ రెడ్డి మధ్య కథా చర్చలు కూడా జరిగాయట. సూరి చెప్పిన కథ చరణ్ కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. సురేందర్ రెడ్డి సినిమాని ఎంత స్టైలిష్ గా తెరకెక్కిస్తాడో అందరికీ తెలిసిందే. అంతేకాదు హీరో ని చాలా పవర్ ఫుల్ గా క్లాసీగా చూపించడంలో సూరి స్టైలే వేరు. దాంతో మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తి నెలకొంది.

 

ఇక మరో న్యూస్ కూడా చరణ్ సినిమా విషయంలో సెన్షేషన్ గా మారింది. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో రాం చరణ్ హీరోగా సినిమా రూపొందనుందని. ఈ సినిమాని వంశీపైడిపల్లి తెరకెక్కిస్తాడని చెప్పుకుంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలీదు గాని వినడానికి న్యూస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగా ఉంది. అయితే ఈ న్యూస్ నిజయ్యో అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థలో ఇప్పటికే సినిమాని నిర్మిస్తున్నాడు. మరో ఇద్దరు హీరో తో సినిమాలు నిర్మించడానికి సన్నాహాలలో ఉన్నాడు.     

మరింత సమాచారం తెలుసుకోండి: