ప్రస్తుతం భారతీయ చలనచిత్ర రంగంలో గత కొన్ని సంవత్సరాల నుండి మల్టీస్టారర్ పర్వం కొనసాగుతోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక భాషలలో వివిధ హీరోలు కలిసి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. తాజాగా సౌత్ ఇండియాలో దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారి కలసి 'RRR' సినిమా చేయడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

IHG

ఇదిలావుండగా టాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు హీరోలు కలిసి సూపర్ మల్టీ స్టారర్ సినిమా ప్రస్తుతం చేస్తున్నారు. సౌత్ ఇండియా లో తెరకెక్కుతున్న అన్ని మల్టీస్టారర్ సినిమాలో ఈ సినిమాకి కూడా మంచి ప్రాధాన్యత సంతరించుకుంది. కింగ్ నాగార్జున మరియు కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ కలిసి సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ డూపర్ హిట్ అయిన 'రుద్ర' సినిమాని నాగార్జున... ధనుష్ కలసి నటిస్తున్న తరుణంలో కోలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాపై మంచి హైప్ నెలకొంది.

IHG

స్వయంగా ధనుష్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న నేపథ్యంలో తమిళ సినిమా రంగంలో  అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మొదటి లో నాగార్జున నటిస్తున్న క్యారెక్టర్ లో రజినీకాంత్ తో చేయించాలని ధనుష్ ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ రజనీకాంత్ ఒప్పుకోక పోవడంతో ఆ ప్లేస్ లో నాగార్జున ఒకే అవ్వడం జరిగింది. హిస్టారికల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా త్వరగా కంప్లీట్ చేయాలని ధనుష్ పక్కా ప్రణాళికతో రెడీ అయినట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: