పృథ్వీరాజ్ సుకుమారన్ , బిజూ మీనన్ టైటిల్ రోల్ లో నటించగా  ఫిబ్రవరి లో విడుదలై 60కోట్ల వసూళ్లను రాబట్టి సంచలన విజయం సాధించింది మళయాలం మూవీ  అయ్యప్పనుమ్ కోషియం. ఈ చిత్రం తెలుగు లో రీమేక్ కానున్న విషయం తెల్సిందే. ఈ రీమేక్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. ఇక ఈరీమేక్ కోసం హీరోలు కూడా దొరికారు. మాస్ మహారాజ్ రవితేజ ,రానా దగ్గుబాటి ఈసినిమా చేయాలనీ డిసైడ్ అయ్యారు. రవితేజ, బిజూ మీనన్ పాత్రలో కనిపించనుండగా రానా, పృథ్వీరాజ్ పాత్రలో నటించనున్నాడు అయితే ఈ సబ్జెక్టు ను పక్కగా  డీల్ చేసే డైరెక్టర్ కోసం వెతుకుతున్నారు నిర్మాతలు. గతంలో బాబీ,శ్రీకాంత్ అడ్డాల వంటి యువ దర్శకులు మల్టీ స్టారర్  చిత్రాలను  బాగానే డీల్ చేశారు దాంతో ఈసినిమాకు కూడా  వీరిద్దరి లో ఎవరో ఒకరిని డైరెక్టర్ గా ఎంపిక చేసే అవకాశం లేకపోలేదని ఫిలిం నగర్ టాక్. త్వరలోనే ఈసినిమాకు డైరెక్టర్ ఎవరనేది తేలిపోనుంది. 
 
అన్నికుదిరితే ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక రవితేజ ప్రస్తుతం క్రాక్ లో నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దాదాపుగా  పూర్తి కావొచ్చింది అలాగే  రానా,విరాటపర్వం లో  నటిస్తున్నాడు ఈ సినిమా కూడా తుది దశకు చేరుకుంది. ఈసినిమాలను పూర్తి చేసి అయ్యప్పనుమ్ కోషియం కోసం డేట్స్ ఇవ్వనున్నారు. 
 
ఇదిలావుంటే తమిళ, హిందీ భాషల్లో కూడా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్  కానుంది. తమిళం లో సూర్య , కార్తీ ఈ రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారట. ఇక హిందీ రీమేక్ హక్కులను  బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం దక్కించుకున్నాడు. జేబీ ప్రొడక్షన్స్ ఈసినిమా ను నిర్మించనుండగా అందులో జాన్ అబ్రహం ఓ హీరోగా నటించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: