పృథ్వీరాజ్ సుకుమారన్ , బిజూ
మీనన్ టైటిల్ రోల్ లో నటించగా
ఫిబ్రవరి లో విడుదలై 60కోట్ల వసూళ్లను రాబట్టి సంచలన విజయం సాధించింది మళయాలం మూవీ
అయ్యప్పనుమ్ కోషియం. ఈ చిత్రం తెలుగు లో రీమేక్ కానున్న విషయం తెల్సిందే. ఈ రీమేక్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. ఇక ఈరీమేక్ కోసం హీరోలు కూడా దొరికారు. మాస్ మహారాజ్ రవితేజ ,రానా దగ్గుబాటి ఈసినిమా చేయాలనీ డిసైడ్ అయ్యారు. రవితేజ, బిజూ మీనన్ పాత్రలో కనిపించనుండగా రానా, పృథ్వీరాజ్ పాత్రలో నటించనున్నాడు అయితే ఈ సబ్జెక్టు ను పక్కగా డీల్ చేసే డైరెక్టర్ కోసం వెతుకుతున్నారు నిర్మాతలు. గతంలో బాబీ,శ్రీకాంత్ అడ్డాల వంటి యువ దర్శకులు మల్టీ స్టారర్ చిత్రాలను బాగానే డీల్ చేశారు దాంతో ఈసినిమాకు కూడా వీరిద్దరి లో ఎవరో ఒకరిని డైరెక్టర్ గా ఎంపిక చేసే అవకాశం లేకపోలేదని ఫిలిం నగర్ టాక్. త్వరలోనే ఈసినిమాకు డైరెక్టర్ ఎవరనేది తేలిపోనుంది.