బాలీవుడ్ లో ప్రముఖులకు మేనేజర్ గా పని చేసిన దిశా సాలియన్ మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు గతంలో మనేజర్ గా పని చేసింది దిశా. పశ్చిమ మలాద్ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ 14వ అంతస్థు నుంచి ఆమె పడిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటన బాలీవుడ్ లో కలకలం రేపింది. దిశ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. దిశ ఆత్మహత్య చేసుకుందా.. యాక్సిడెంటల్ గా అక్కడి నుంచి పడిపోయిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.
దిశా తన తల్లిదండ్రులతో కలిసి దాదర్ ప్రాంతంలో నివసిస్తోంది. సోమవారం రాత్రి మలాద్ లోని రోహన్ రాయ్ ఫ్లాట్ లో కొంతమందితో జరిగిన పార్టీకి హాజరైంది. రాత్రి డిన్నర్ అయ్యాక అందరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం.. మంగళవారం తెల్లవారుఝామున ఒంటిగంట ప్రాంతలో దిశా 14వ అంతస్థు నుంచి పడిపోయింది. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించిననట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆమెతో పాటు కాబోయే భర్త రోహన్ రాయ్ ఉన్నట్టు సమాచారం. దిశా ఆత్మహత్య చేసుకుందా.. మరేదైనా కారణం ఉందా అనేది విచారణలో తేలుతుందని పోలీసులు అంటున్నారు.
దిశకు ఎవరితోనూ విబేధాలు లేవని తల్లిదండ్రులు అంటున్నారు. దిశ మృతి చెందడంపై ప్రముఖ నటుడు వరుణ్ శర్మ స్పందించారు. ‘మంచి తెలివితేటలు, వ్యక్తిత్వం ఉన్న ఫ్రెండ్ ను త్వరగా కోల్పోయాను. ఆమెతో మంచి జ్ఞాపకాలు ఉన్నాయని’ తన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చాడు. దిశ.. గతంలో వరుణ్ శర్మ, ఐశ్వర్యారాయ్ బచ్చన్, కమెడియన్ భారతీ సింగ్ కు కూడా మేనేజర్ గా పనిచేసిందని తెలుస్తోంది.
View this post on InstagramAm at a loss of words . Speechless. Numb . It all looks unreal .So many memories. Such a lovely person and a dear friend . You always wore that smile everyday , and with such kindness you dealt with everything that came your way . You will be deeply missed.Prayers and Strength to the Family. I still can’t believe Disha you’re gone. Gone too Soon💔