సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎవరికోసమో రాసుకున్న కథల్లో మరెవరో హీరోగా కనిపిస్తారు. అలా మంచి మంచి హిట్ సినిమాలని మిస్ అయిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. నీది నాది ఒకే కథ సినిమా ద్వారా మంచి అనుభూతిని ఇచ్చిన దర్శకుడు వేణు ఊడుగుల, తన రెండవ చిత్రం రానా దగ్గుబాటి హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా విరాట పర్వం అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నాడు. 

IHG

తెలంగాణ ప్రాంతంలో 1990 ల కాలంలో జరిగిన నక్సలైట్ల కథాంశాన్ని తీసుకుని ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో జాతీయ ఉత్తమ నటి ప్రియమణి కూడా ఓ కీలకమైన పాత్ర పోషిస్తుంది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ప్రియమణి నటిస్తున్న మొదటి తెలుగు చిత్రం ఇదే. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన పోస్టర్లలో సినిమా థీమ్ ని రిప్రెజెంట్ చేసిన పోస్టర్లుగా చెప్పవచ్చు.


పోస్టర్ల ద్వారానే అమితాసక్తిని కలిగించిన వేణు ఊడుగుల, మొదటగా ఈ సినిమాని రానాతో తీద్దామని అనుకోలేదట. కథ రాసుకున్నప్పుడు వేరే హీరోని అనుకున్నాడట. అయితే ఆ హీరోని కాదని గోపీచంద్ దగ్గరికి వచ్చాడట. వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న గోపీచంద్ కి విరాట పర్వం కథ బాగా నచ్చిందట. కానీ అప్పటికే గోపీ చేతిలో సినిమాలు ఉండడంతో విరాట పర్వం సినిమాని వదులుకున్నాడట.

 

ఆ తర్వాత వేణూ వెంటనే సురేష్ ప్రొడక్షన్ ని వెళ్ళాడట. అక్కడ వెంటనే రానా ఒప్పుకోవడంతో సినిమా పట్టాలెక్కించేసారు. ఈ సినిమా ఖచ్చితంగా మరో పాథ్ బ్రేకింగ్ సినిమా అయ్యేలా ఉందని అనుకుంటున్నారు. ఇంత మంచి సినిమాని గోపీచంద్ ఎలా వదిలేసుకున్నాడంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఒకవేళ గోపీచంద్ సినిమా ఒప్పుకున్నా ఆయనకి ఉన్న పరాభవాల వల్ల సినిమాకి అంత హైప్ వచ్చేది కాదేమో అని సందేహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: