సీనియర్ టాప్ హీరో బాలకృష్ణకు గోపీ చాంద్ కు ఏవిషయంలోను పోలికలేదు వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు కూడ లేవు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ ఒకే విధంగా ఘోర పరాజయాల బాటలో పయనిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో వీరిద్దరూ ఎంపిక చేసుకున్న సినిమాలకు సంబంధించి ఒక సారూప్యత లేటెస్ట్ గా బయటపడింది.


గత సంవత్సరం దర్శకుడు పరుచూరి మురళి గోపీ చంద్ కు ఒక కథ వినిపించాడట. అయితే ఆకథ గోపీ చంద్ కు నచ్చక పోవడంతో ఆకథ తిరిగితిరిగి బాలకృష్ణ వద్దకు చేరుకొని ఆమూవీ కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ మూవీగా విడుదలై ఘోర పరాజయం చెందింది. ఈ మూవీని బాలయ్య అభిమానులు కూడ భరించ లేకపోయారు. ఇప్పుడు తేజ గోపీ చంద్ తో త్వరలో షూటింగ్ మొదలుపెట్టబోతున్న ‘అలివేలు వెంకటరమణ’ మూవీ కథను బాలయ్యను దృష్టిలో పెట్టుకుని వ్రాసాడట.


గతంలో బాలకృష్ణ నటించిన ‘నారీ నారీ నడుమ మురారీ’ మూవీ కథలా తేజ వ్రాసిన ‘అలివేలు వెంకటరమణ’ కథ కూడ ఉంటుంది అని టాక్. వాస్తవానికి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కోసం మొదట్లో తేజా ను ఎంపిక చేసుకున్నప్పుడు ఆ సమయంలోనే బాలయ్యకు ఈ కథ చెప్పాడని టాక్. అయితే బాలయ్యకు తేజా కు ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో గ్యాప్ ఏర్పడటంతో తేజా కథ బాలయ్యతో సెట్స్ పైకి వెళ్ళలేదు.

 

ఇప్పుడు అదే కథను కొద్దిగా మార్పులు చేసి తేజా గిపీ చంద్ తో తన ‘అలివేలు వెంకటరమణ’ ను చేయడానికి రెడీ అవుతున్నాడు. అలివేలు గా అనుష్క ఒప్పుకుంటే వెంటనే షూటింగ్ ప్రారంభం అయిపోతుంది. ఇలా బాలయ్య వద్దు అనుకున్న కథ గోపీ చంద్ కు గోపీ చంద్ తిరస్కరించిన కథ బాలయ్యకు జరగడంతో ఈఇద్దరి హీరోల కథల ఎంపిక విషయంలో కొనసాగిన మ్యూజికల్ చైర్స్ ఈలాక్ డౌన్ సమయంలో ఇండస్ట్రీ వర్గాలలో అనుకోని హాట్ టాపిక్ గా మారింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: