ఇప్పుడు మన తెలుగులో ఉన్న పరిస్థితి చూస్తే సినిమాలను విడుదల చేయడానికి దాదాపుగా ఆరు నెలల వరకు పట్టే అవకాశాలు ఉన్నాయి. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే ఈ ఏడాది సినిమాల మీద దాదాపుగా ఆశలు వదులుకునే పరిస్థితి టాలీవుడ్ లో ఉంది అని చెప్పవచ్చు. చిన్న హీరోల సినిమాల విషయంలో ఇప్పుడు భయం లేదు గాని అగ్ర హీరోల సినిమాల విషయంలో మాత్రం టాలీవుడ్ లో భయం ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు హీరోలు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అని తెలుస్తుంది. 

 

స్టార్ హీరోలు అందరూ కూడా ఇప్పుడు వెబ్ సీరీస్ లు చేసి ఓటీటీ లో విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు అని సమాచారం. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఓటీటీ మీద మాత్రం మన హీరోలు చాలా వరకు ఫోకస్ చేసారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇటీవల తారక్ మహేష్ బాబు ఓటీటీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు అనే ప్రచార౦ అనేది జరుగుతుంది. దానిలో సినిమాలను విడుదల చేయడానికి గానూ ఆసక్తి చూపిస్తున్న హీరోలు చిన్న చిన్న బడ్జెట్ తో ప్లాన్ చేసి వెబ్ సీరీస్ లను విడుదల చేసే ఆలొచనలొ ఉన్నారు అని అంటున్నారు. 

 

దీని మీద అందరూ కూడా ఇప్పుడు ఒక ప్లాన్ చేసి చేసే సినిమాలకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇక ఇప్పటికే కొడుకులతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ వెబ్ సీరీస్ చేసే అవకాశం ఉంది అనే ప్రచార౦ జరుగుతుంది. దీనిని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. చూడాలి మరి ఎవరు ఎవరు వెబ్ సీరీస్ లు చేస్తారు అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: