ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది పూజా హెగ్డే. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్స్ నటించిన భారీ బడ్జెట్ సినిమాలలో హీరోయిన్ గా నటించిన పూజా లక్కీ హీరోయిన్ అనిపించుకోవడమే కాదు స్టార్ స్టేటస్ ని అందుకుంది. హీరోలకి.. దర్శక, నిర్మాతలకి ప్రాజెక్ట్ అనుకుంటే పూజా హెగ్డేనే ఫస్ట్ ఛాయిస్ అవుతోంది. 

 

అందుకే పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మంచి ఫాం లో ఉంది. ఇక ప్రస్తుతం పూజా హెగ్డే రెబల్ స్టార్ ప్రభాస్ సరసన తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కాకుండా  త్రివిక్రం - ఎన్.టి.ఆర్ సినిమా...ప్రభాస్ - నాగ్ అశ్విన్ సినిమాలలో కూడా పూజా హెగ్డే ని అనుకుంటున్నారట. 

 

ఇక బాలీవుడ్ లోనూ పూజా హెగ్డే రెండు సినిమాలు కమిటయిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా కాగా, మరో సినిమా అక్షయ్ కుమార్ సినిమా కావడం విశేషం. ఈ రెండు సినిమాలకి గాను పూజా హెగ్డే అందుకుంటున్న రెమ్యూనరేషన్ దాదాపు మూడు కోట్లని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అది వాస్తవమన్న మాటలు వినిపించినప్పటికి ఇప్పుడు ఇందులో బాగా కోత పడినట్టు తెలుస్తోంది. 

 

అందుకు కారణం కరోనా.. వాస్తవంగా బాలీవుడ్ సినిమాలంటే కాస్త ఘాటు సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు అక్కడ మార్కెట్ ఎక్కువ...జరిగే వ్యాపారం కూడా అంతకు నాలుగింతలు ఉంటుంది. అందుకే టాలీవుడ్ లో తనకున్న క్రేజ్ ని దృష్ఠిలో పెట్టుకునే బాలీవుడ్ లో డిమాండ్ చేయగా ఒకే అన్న మేకర్స్ ఇప్పుడు అంత రెమ్యూనరేషన్ ఇవ్వలేమని అంటున్నారట. ముందు అనుకున్న రెమ్యూనరేషన్ లో దాదాపు 30 శాతం రెమ్యూనరేషన్ కోత పడినట్టు సమాచారం. ఇది ఒకరకంగా పూజా హెగ్డేకి పెద్ద షాకే అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: