బాహుబలి సినిమా తర్వాత అనుష్క రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా విజయంతో ఆమె కెరీర్లో చాలా మార్పులు వచ్చాయి. అప్పటి వరకూ హీరో సరసన హీరోయిన్ గా చేసిన అనుష్క, ఆ తర్వాత సోలో హీరోయిన్ గా లేడీ ఓరియంటెడ్ సినిమాలే చేస్తుంది. సైజ్ జీరో మొదలుకుని, భాగమతి, నిశ్శబ్దం వరకూ అన్నీ లేడీ ఓరియంటెడ్ చిత్రాలే. నిశ్శబ్దం చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

సినిమా ఒటీటీలో విడుదల అవుతుందంటూ వార్తలు వచ్చినా అవన్నీ వట్టి మాటలేనని తేలిపోయింది. చిత్ర నిర్మాత కోనవెంకట్ ఈ విషయమై స్పష్టత ఇవ్వడంతో ఓటీటీలో రిలీజ్ అవుతుందన్న వార్తలకి ఫుల్ స్టాప్ పడింది. ఆల్రెడీ సెన్సార్ పూర్తి చేసుకున్న నిశ్శబ్దం థియేటర్లు ఓపెన్ అయ్యాక రిలీజ్ అయ్యే మొట్టమొదటి చిత్రం అయ్యే అవకాశం ఉంది. అయితే నిశ్శబ్దం తర్వాత అనుష్క చిత్రం ఎవరి దర్శకత్వంలో ఉంటుందనేది తేలిపోయింది.

 

 


తాజా సమాచారం ప్రకారం యూవీ క్రియేషన్స్ అనుష్క ప్రధాన పాత్రలో మరో లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించనుందట. ఇప్పటికే అనుష్క హీరోయిన్ గా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మిర్చి, భాగమతి అను రెండు చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు అనుష్క కెరీర్లో మంచి విజయాలని సాధించాయి. మరో మారు ముచ్చటగా మూడవసారి అనుష్క ప్రధాన పాత్రలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా రూపొందనుంది.

 

 

సందీప్ కిషన్ హీరోగా నటించిన రా రా క్రిష్ణయ్య సినిమాకి దర్శకత్వం వహించిన మహేష్, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడట. 2014 లో విడుదలైన మహేష్ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. మరి ఫ్లాప్ దర్శకుడితో అనుష్క చేస్తున్న ప్రయోగం సక్సెస్ అవుతుందేమో చూడాలి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: