తెలుగులో చాలా వరకు స్టార్ హీరోలకు ఇప్పుడు కథల విషయంలో ఏ ఇబ్బంది లేదు అనే చెప్పవచ్చు. చిన్న హీరోలు అయినా పెద్ద హీరోలు అయినా సరే కథలకు ఏ మాత్రం ఇబ్బంది పడటం లేదు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు కొన్ని కొన్ని కథల విషయంలో మాత్రం టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఒకటికి వంద సార్లు ఆలోచించే ప్రయత్నం  మాత్రం చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల కొందరు స్టార్ హీరోలు అయితే కథల విషయంలో యువ దర్శకులను నమ్మవద్దు అని భావిస్తున్నారట. ఇప్పుడు మహేష్ బాబు కి కథల విషయంలో భయం మొదలయింది అని సమాచారం. 

 

దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని మహేష్ బాబు మాత్రం కథల విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నాడు అనేది టాలీవుడ్ జనాల మాట. సర్కారు వారి పాట కథ విషయంలో అతను చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు కథలో కొన్ని మార్పులు చేయడానికి గానూ. దర్శకుడు పరుశురాం తో  ఇప్పటికే కథ విషయంలో చాలా వరకు చర్చలు జరిపాడు. ఆయన కూడా దీని మీద  కాస్త సానుకూలంగానే స్పందించి కథను మార్చడానికి సిద్దంగా ఉన్నాడు అని తెలిసింది. ఇక ఇప్పుడు మహేష్ కూడా కొన్ని కొన్ని వద్దు అని చెప్పినట్టు సమాచారం. 

 

దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని అనీల్ రావిపూడి తో  చేసిన సరిలేరు నీకేవ్వరు సినిమా మహేష్ బాబుని బాగా ఇబ్బంది పెట్టింది అని అందుకే మహేష్ బాబు ఇప్పుడు కథ విషయంలో అంత భయపడుతున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ కథను మార్చే విషయంలో నిర్మాతలతో కూడా అతను చర్చలు జరిపాడు అని సమాచారం. మరి మారుస్తారా లేదా అనేది చూడాలి అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: