ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఒకే ఒక్కటి కరోనా.. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించి లక్షల మంది ప్రాణాలను తీసింది.కరోనా ప్రభావ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించి అన్నిటిని మూసివేసింది. దీంతో సినిమాల విడుదల వాయిదా పడింది. చిత్రీకరణలో ఉన్న సినిమాలు, సీరియల్స్ ఎక్కడిక్కడకు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గి జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

 

 

అసలు విషయానికొస్తే.. తనకు షూటింగులు లేకపోతే కనుక హాట్ బ్యూటీ  శ్రుతి హాసన్ ముంబైలో కానీ, చెన్నైలో కానీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు షూటింగులు ఏవీ లేకపోయినా అమ్మడు హఠాత్తుగా హైదరాబాదుకు వచ్చివాలింది. దీనికి కారణం ఏమిటంటే, కరోనా భయమట.. 

 

 

 

గత కొంతకాలంగా ఈ చిన్నది ముంబైలో ఉంటుంది. అయితే, ప్రస్తుతం ముంబై, మహారాష్ట్ర లలో కరోనా వైరస్ విజృంభణ తీవ్ర స్థాయిలో వుంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసులు వేలల్లో పెరిగిపోతున్నాయి.  దీంతో ఇంకా అక్కడే వుండడం క్షేమకరం కాదని భావించిందట. ఓపక్క చెన్నై వెళదామంటే అక్కడ కూడా కరోనా జోరుమీదే ఉంది. దాంతో ఇక హైదరాబాదే సరైన ప్లేస్ అని నిర్ణయించుకున్న శ్రుతి తన స్టాఫ్ ను తీసుకుని రోడ్డు మార్గంలో హైదరాబాదుకి వచ్చేసినట్టు తెలుస్తోంది.

 

 


త్వరలో పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా షూటింగుతో పాటు రవితేజతో నటిస్తున్న 'క్రాక్' సినిమా షూటింగ్ కూడా ఇక్కడే ప్రారంభమవుతాయి. అందుకని ఇక్కడే వుండడం మంచిదని ముద్దుగుమ్మ నిర్ణయించుకుందట. నగరంలో ఓ మంచి ఇల్లును అద్దెకు తీసుకుందని తెలుస్తోంది.సినిమాలు రెండు అయ్యేవరకు హైదరాబాద్ లోనే ఉండబోతున్నట్లు తేల్చి చెప్పేసింది. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత సరైన హిట్స్ లేని ఈ అందాలతారకు ఈ సినిమాలన్నా హిట్ని అందిస్తాయేమో చుడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: