తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరో, హీరోయిన్ల తో సినిమాలు చేసిన ఘనత ఆ డైరెక్టర్ కు ఉంది. అది ఎప్పుడో జమనా కాలం మాట.. ఇప్పుడు ఆయన పేరు పలకడానికి కూడా చాలా మంది భయపడుతున్నారంటే నమ్మండి.. ఇంకా గుర్తు పట్టలేదా ఆయనేనండీ వివాదాలకు పెట్టింది పేరు రామ్ గోపాల్ వర్మ. ఈయన డైరెక్షన్లో అప్పటిలో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయని చెప్పాలి. 

 

 


నాగార్జున, వెంకటేష్, శ్రీదేవి వంటి అగ్ర తారలతో ఎన్నో సినిమాలను తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నారు వర్మ. ఊరికే కారణం లేకుండా అందరికీ రెచ్చిపోయే లా అయిందానికి కానిదానికి నోరు పారేసకోవడం..వర్మకు వెన్నతో పెట్టిన విద్య అన్న విషయం వేరేలా చెప్పన్నక్కర్లేదు.. అలా చేయడంతో వర్మ అందరి దృష్టిని ఆకర్షిస్తారు.. ఇకపోతే వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విమర్శలు మూట కట్టుకున్న విషయం తెలిసిందే..ఎన్ని అన్న ఎం ప్రయోజనం లెండి ఆయన బుద్ది మారలేదుగా.. 

 

 

 

అయితే, అప్పటిలో స్టార్ డైరెక్టర్ గా ఉన్న వర్మ సినిమాలను కొత్తగా చుపించాలంటూ బూతులకు కేరాఫ్ గా ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మక్కువ చూపిస్తున్నాడు. యువతను అక్కట్టుకోవాలనే తపనతో సినిమాలలో వల్గారిటీ ని రుచి చూపిస్తున్నారు.అందాలను చూపిస్తున్నాం యువత ఎంజాయ్ చేయండి అంటూ సెమి బ్లూ ఫిలిమ్స్ చూపిస్తున్నారని కొందరు ఆయనపై  విమర్శలు గుప్పించగా, వారి కొఅందరు అయన అభిమాను మాత్రం అందులో తప్పు లేదని వత్తాసు పడుతుండటం గమనార్హం.

 

 

 

సినిమాలనేవి అందరిని ఆకట్టుకొనేలా ఉండాలి కానీ ఇలా తప్పు త్రోవ పట్టించేలా ఉండకూడదని వర్మ పై సినీ వర్గీయులు, ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. అయన కూడా వర్మ తీరు మారలేదు..ఆయన సినిమాలకు క్లియరెన్స్ ఇస్తున్న సెన్సార్ రాలేదు. ఎంతైనా వర్మ గ్రేట్ అనే చెప్పాలి.. నలుగురు వద్దనుకుంది ఆయన కావాలనుకొని చివాట్లు తింటూ మరి అనుకున్నది సాధిస్తాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: