సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయిందని సమాచారం. అయితే ఇప్పటికే షూటింగ్ కంప్లీటయి 2020 లోపే థియోటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమా చాలా కారణాల వల్ల డిలే అయింది.  మహేష్ బాబు నటిస్తున్న కారణంగా కొంత డిలే అయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆర్.ఆర్.ఆర్ నుండి రాం చరణ్ వస్తాడా రాడా అన్న డైలమా ఒకటి. ఈ నేపథ్యంలో కూడా కొన్ని రోజులు సినిమా ఆలస్యం అయింది.  

 

ఇక హీరోయిన్స్ సమస్య కూడా కారణం. ఇప్పుడు ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చిరంజీవి సరసన ఫైనల్ అయింది. లాక్ డౌన్ తర్వాత సెట్స్ మీదకి రాబోతున్న ఈ సినిమా ముందుగా చిరంజీవి  కాజల్ మీద కాంబినేషన్ సీన్స్ ని కంప్లీట్ చేస్తారని తాజా సమాచారం. అయితే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేద్దామని కొరటాల బృందం అనుకుంటున్న సంగతి తెలిసిందే.

 

కాని ఇప్పుడు తలెత్తున్న పరిస్థితుల్లో సంక్రాంతికి ఆచార్య థియోటర్స్ లోకి వస్తుందా అన్న అనుమానాలు అటు అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలలోను బలంగా ఉన్నాయట. ముఖ్యంగా ఈ సినిమాలో చరణ్ చేయాల్సిన కీలక పాత్ర ఉంది. అది సినిమాకి చాలా ప్రత్యేకం. చరణ్ చిరంజీవి కాంబినేషన్ సీన్స్ కూడా ఉన్నాయి. కాని చరణ్ మీద ఆర్.ఆర్.ఆర్ బాధ్యత ఉంది.

 

రాజమౌళి త్వరలో ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ని మొదలు పెట్టాలనుకుంటున్నారు. కాని ఇప్పుడే బాలీవుడ్ నటులు గాని హాలీవుడ్ నటులు గాని వచ్చే అవకాశం లేదని అంటున్నారు. అంటే ప్రస్తుతం తారక్ చరణ్ కాంబినేషన్ లో ఉన్న సీన్స్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా మిగతా ఆర్టిస్టుల కాంబినేషన్ లో సీన్స్ చిత్రీకరించనున్నారట. అంటే ఇప్పట్లో ఆర్.ఆర్.ఆర్ సెట్స్ నుంచి చరణ్ బయటకు రావడం కష్టమే. అదీకాక మళ్ళీ లాక్ డౌన్ అన్న మాట వినిపిస్తుంది. ఇవన్ని చూస్తుంటే నిజంగా ఆచార్య 2021 సంక్రాంతి కి రిలీజ్ చేయాలని పెట్టుకున్న టార్గెట్ మిస్ అవుతుందనే అనిపిస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: