టాలీవుడ్ లో చాలా తక్కువ సినిమాలే చేసినా సరే నిత్యా మీనన్ కి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసి అవి కూడా మంచి మంచి సినిమాలు చేయడం అవి హిట్ కావడంతో పాప కెరీర్ లో మంచి పేరు వచ్చింది అనే చెప్పవచ్చు. అగ్ర హీరోల సినిమాలు  కొన్ని ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్ లో ఆమె తక్కువ సేపే కనపడినా సరే ఆమె పాత్ర మాత్రం బాగా హైలెట్ అయింది సినిమాలో అనే సంగతి అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె సినిమాల్లో ఎక్కువగా బాలీవుడ్ మీదే దృష్టి పెట్టింది. 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమెకు మరో ఆఫర్ వచ్చింది టాలీవుడ్ లో. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో నిత్యా మీనన్ ని తీసుకునే అవకాశం ఉంది అని సమాచారం. ఆ సినిమాలో ఆమె డాక్టర్ గా నటించే అవకాశం ఉండి అని తెలుస్తుంది. ఈ సినిమాలో ఆమెను నటించాలి అని స్వయంగా త్రివిక్రమ్ ఫోన్ చేసి అడిగారు అని సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఒక సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించారు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఆమెకు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. 

 

సినిమా తర్వాత జనతా గ్యారేజ్ లో నటించింది. ఇప్పుడు మరో సారి తన సినిమాలో నటించాలి అని త్రివిక్రమ్ తారక్ ఇద్దరూ ఆమెను అడిగారు అని సమాచారం. మరి  ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఆమెను మాత్రం త్వరలోనే ఈ సినిమాలో తీసుకునే విషయానికి సంబంధించి కీలక ప్రకటన వచ్చే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు. చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: