పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన లోఫర్ సినిమాలో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన హాట్‌ బ్యూటీ దిశా పటాని. ప్రస్తుతం బాలీవుడ్‌ లో స్టార్ హీరోయిన్‌ గా ఓ వెలుగు వెలుగుతున్న ఈ బ్యూటీ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటుంది. శనివారం తన 27వ ఏట అడుగుపెడుతున్న ఈ బ్యూటీ కెరీర్‌ లో కొన్ని ఇంట్రస్టింగ్ అంశాలు.

 

టైగర్‌ ష్రాఫ్‌ గర్ల్‌ ఫ్రెండ్‌గా బాలీవుడ్ లో పాపులర్ అయిన ఈ బ్యూటీ ఇన్‌ స్టాగ్రామ్‌ లో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ పాపులర్ అయ్యింది. తాజాగా ఈ భామ పుట్టిన రోజు సందర్భంగా ముద్దుగుమ్మ జీవితంలోని ఇంట్రస్టింగ్ విషయాలు మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సుషాంత్‌ సింగ్ రాజ్‌పుత్ హీరోగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ ఎంఎస్‌ ధోని సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది ఈ బ్యూటీ.

 

ఆ తరువత టైగర్‌ ష్రాఫ్‌ తో కలిసి బేఫిక్రా అనే మ్యూజిక్ వీడియోలో నటించింది. అంతేకాదు అంతర్జాతీయ చిత్రంగా తెరకెక్కిన జాకీచాన్‌ కుంగ్‌ ఫూ యోగా సినిమాలో నటించింది. తన కెరీర్‌ స్టార్టింగ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పింది దిశ. తాను నటి కావాలన్న కోరికతో చదువు కూడా మధ్యలోనే వదిలేసింది.

 

అంతేకాదు కేవటం 500 రూపాయలు జేబులో పెట్టుకొని ముంబై లో అడుగుపెట్టిందట ఈ బ్యూటీ. డ్యాన్సింగ్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ రణబీర్‌ కపూర్‌ అంటే పడి చచ్చిపోతుంది. తాను చదువుకునే రోజుల్లో రణబీర్‌ కపూర్‌ పోస్టర్‌ లు చేసేందుకే ఓ రోడ్‌లో జర్నీ చేసేదట. టైగర్‌లో రిలేషన్‌ కన్నా ముందు ఓ టీవీ స్టార్‌ తో కొంత కాలం డేటింగ్ చేసింది దిశా.

మరింత సమాచారం తెలుసుకోండి: