ఒక పక్క కోవిడ్ 19 విజృంభణ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. కోవిడ్ వల్ల సినిమా  ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. సినిమా షూటింగులు ఆగిపోయాయి. రిలీజ్ లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న అనుమానాలు కలిగాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతుల ప్రకారం సినిమా షూటింగులు జరగనున్నాయి. అలాగే కొత్త సినిమాలు లాంచ్ కానున్నాయి. దానిలో భాగంగా నాగార్జున కొత్త సినిమా మరికొద్ది రోజుల్లో లాంచ్ అవనుంది.

 

గత కొన్ని రోజులుగా నాగార్జున చేసిన సినిమాలేవీ కలిసి రావట్లేదు. రామ్ గోపా;ల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆఫీసర్, అందాల రాక్షసి ద్వారా హీరోగా పరిచయమైన రాహుల్ రవీంద్రన దర్శకత్వంలో వచ్చిన మన్మధుడు 2 చిత్రాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. దాంతో హీరోగా నాగార్జున కెరీర్ కి కొంత దెబ్బ పడినట్టే అయింది. అయితే ప్రస్తుతం మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాకి రచయితగా పనిచేసిన సాల్మన్ దర్శకత్వంలో వైల్డ్ డాగ్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.

 

ఎప్పుడు కన్ఫర్మ్ చేసాడో గానీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావడానికి వచ్చిందట. ఇదిలా ఉంటే నాగార్జున హీరోగా మరో సినిమా మొదలు  కాబోతుంది. ఎల్ బీ డబ్ల్యూ సినిమాతో దర్శకుడిగా మారిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున సినిమా తెరకెక్కబోతుందిట. ప్రవీణ్ సత్తారు ఇప్పటి వరకూ ఎల్ బీ డబ్ల్యూ, చందమామ కథలు, గుంటూర్ టాకీస్, గరుడవేగ వంటి చిత్రాలని తెరకెక్కించాడు. వీటన్నింటిలో గరుడవేగ సినిమా ప్రేక్షకులని అమితంగా ఆకర్షించింది.

 

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరోగా చేసిన ఈ సినిమా ఆయనకి మంచి విజయాన్ని తెచ్చి పెట్టింది. అయితే ఈ దర్శకుడితో నాగార్జున థ్రిల్లర్ కథాంశంతో మన ముందుకు వస్తున్నాడట. గరుడవేగ సినిమాలాగే ఈ సినిమా కూడా ఆద్యంతం కొత్తగా ఉండనుందట. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన మరి కొద్దిరోజుల్లో వెలువడనుందని తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: