గత ఏడాది బాలయ్య హీరోగా చేసిన సినిమాలేవీ బాక్సాఫీసు వద్ద తమ సత్తా చూపలేకపోయాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలకి సరైన రెస్పాన్స్ రాకపోగా రూలర్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో బాలయ్య మార్కెట్ ఎప్పుడూ లేనంతగా పడిపోయింది. ఈ విషయం బాలయ్య అభిమానుల్లో నిరుత్సాహాన్ని నింపింది. సింహా సినిమాకి ముందు బాలయ్య ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడో అలాంటి సిట్యుయేషనే మళ్లీ కనిపించింది.

 

 

 


అయితే అప్పుడు సింహా సినిమా ద్వారా లెక్కలన్నీ మార్చిన బోయపాటి, ఇప్పుడు మళ్ళీ లెక్క మార్చడానికే వచ్చినట్టు కనిపిస్తున్నాడు. రూలర్ చిత్ర పరాజయం తర్వాత బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో సినిమా స్టార్ట్ అయింది. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలేవీ లేవు. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, బాలయ్యకి వరుస పరాజయాలు. రెండు, బోయపాటికి వినయ విధేయ రామతో చేదు అనుభవం.

 

 

ఈ రెండింటి వల్లా ఈ కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రంపై ఎలాంటి అంచనాలు లేకుండానే స్టార్ట్ అయింది. అయితే బాలయ్య అభిమానుల్లో ఎక్కడో చిన్న ఆశాకిరణం కనిపించింది. ప్రస్తుతం ఆ కిరణం తాలూకు వెలుగు మెల్లమెల్లగా విస్తృతమవుతున్నట్లుగా ఉంది. బాలయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని, బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమా నుండి టిజర్ ని వదిలారు.

 

 

జూన్ 10వ తేదీన రిలీజ్ చేసిన ఈ టీజర్ కి ఇప్పటి వరకూ 10 మిలియన్లకి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ రెస్పాన్స్ చూస్తుంటే మరో మారు బోయపాటి హిట్ ఇచ్చేలా కనబడుతున్నాడు. దీంతో చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడట. ప్రస్తుతం బీబీ3 యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాకి మోనార్క్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: