ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్ లు అందరూ కూడా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు. స్టార్ హీరోయిన్ లు గా ప్రస్తుతం పూజ హెగ్డే, రష్మిక మందన ఉన్నారు. వీరే ఇప్పుడు వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు స్టార్ హీరోలతో అనే విషయం తెలిసిందే. మ‌న స్టార్ హీరోలు ఎన్టీఆర్‌, మ‌హేష్‌, రామ్‌చ‌ర‌ణ్ , బ‌న్నీ నుంచి మీడియం రేంజ్ హీరోల వ‌ర‌కు అంద‌రూ వీరితోనూ రొమాన్స్ చేయాల‌ని ఉబ‌లాట ప‌డుతున్నారు. అయితే ఇప్పుడు వీరికి చెక్ పెట్టే ప్రయత్నాలు టాలీవుడ్ లో జరుగుతున్నాయి. 

 

వీరిని పక్కన పెట్టడానికి గానూ స్టార్ హీరోలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇతర భాషల మీద ఫోకస్ చేసి తెలుగుకి అన్యాయం చేస్తున్నారు అని పలువురు ఆగ్రహంగా ఉన్నార‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. అందుకే మహేష్ బాబు ఇటీవల పూజ హెగ్డే విషయంలో అసహనం వ్యక్తం చేసినట్టు టాక్. ఆమె తమిళంలో ఒక ప్రాజెక్ట్ ఒప్పుకుని సర్కారు వారి పాట సినిమాకు డేట్స్ తక్కువగా ఇచ్చింద‌ట‌. 

 

దీనితో ఆమెను అవసరం లేదని మహేష్ చెప్పారట. ఇక బాలీవుడ్ లో కూడా ఆమె సినిమాలు చేస్తుంది. అందుకే ఆమెను అక్కడే సినిమాలు చేసుకోవాలని ఇక్కడ స్టార్ ఇమేజ్ వచ్చినా ఇక్క‌డ ఎందుకు సినిమాలు చేయ‌డం లేద‌నే అనే ఆగ్రహంలో మ‌న స్టార్ హీరోలు ఉన్నారట. రష్మిక ను కూడా పుష్ప సినిమాలో తప్పించే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. త్వరలోనే పుష్ప సినిమాకు కొత్త హీరోయిన్ ని ప్రకటిస్తార‌ని టాక్‌..?

మరింత సమాచారం తెలుసుకోండి: