బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. బాలీవుడ్ ప్రముఖ నటుడైన రతన్ చోప్రా శుక్రవారం మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. నిజానికి ఈ రతన్ చోప్రా జనవరి నెలలో క్యాన్సర్ తో బాధపడుతూ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పంజాబ్ లోని మలర్ కోట్ల లో మృతి చెందడం జరిగింది. గత కొంతకాలంగా రతన్ చోప్రా చాలా దిన పరిస్థితులను ఎదురుకోవడం జరిగింది.
అంతేకాకుండా రతన్ చోప్రా ఆర్థిక సమస్యల కారణంగా హర్యానాలోని పాంచ్కులలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని జీవనం కొనసాగించాడు. ఒకానొక సమయంలో అతనికి తిండి లేకపోవడంతో అతని ఇంటికి సమీపంలోని ఆలయాలే అతనికి ఆహారాన్ని పెడుతున్నాయి. ఇక అంతే కాకుండా రతన్ చోప్రా వివాహం చేసుకోకుండా అనిత అనే యువతిని తన కూతురుగా దత్తత తీసుకోవడం జరిగింది. ఇక అనిత మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి క్యాన్సర్ చికిత్స కోసం డబ్బులు లేని పరిస్థితిలో మృతిచెందాడు అంటూ ఆమె తెలియచేసింది.
ఇక మరోవైపు గత కొన్ని రోజుల క్రితం రతన్ చోప్రా బాలీవుడ్ ప్రముఖ నటులైన ధర్మేంద్ర, అక్షయ్ కుమార్, సోనూసూద్లను ఆర్థిక సహాయం అడిగినప్పటికీ కూడా వారి నుంచి ఎటువంటి సహాయం రాలేదని రతన్ చోప్రా బంధువులు తెలియజేశారు. ఇక రతన్ చోప్రా పంజాబ్ యూనివర్సిటీ నుంచి కూడా అందుకోవడం జరిగింది. ఆ తర్వాత పటియాలాలో పీజీ విద్యను పూర్తి చేసుకున్నాడు. తన పీజీ విద్య పూర్తి అయిన అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించడం జరిగింది.
అలాగే అలనాటి నటి హీరోయిన్ కాజల్ తో కలిసి "మామ్ కీ గుడియా" అనే సినిమాలో ప్రధాన పాత్ర కూడా పోషించడం జరిగింది. ఇది ఇలా ఉండగా రతన్ నానమ్మకు నటనపై ఇష్టం లేకపోవడంతో అతడు సినీ ఇండస్ట్రీకి దూరం అవడం జరిగింది. ఇక సినీ కెరియర్ పూర్తి అయిన తరువాత రతన్ పలు స్కూళ్లలో ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తూ జీవనం కొనసాగించడం జరిగింది.