బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్, ప్రస్తుతం రాధాక్రిష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్ర టైటిల్ గురించి అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నెలలో ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని వార్తా కథనాలు రావడంతో ప్రభాస్ అభిమానులు ఆసక్తి మొదలైంది.

 

ఇదిలా ఉంటే ఈ సినిమా అనంతరం ప్రభాస్, తన తర్వాతి చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్నానని ప్రకటించాడు. ఎవడే సుబ్రమణ్యం సినిమా ద్వారా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న నాగ్ అశ్విన్, మహానటి సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా ఎలా ఉంటుందన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో ఉంది.

 

అయితే ఇప్పటికే ఈ సినిమా గురించి అనేక కథనాలు వచ్చాయి. టైమ్ ట్రావెలర్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని, అలాగే దేవకన్యకి ప్రభాస్ కొడుకుగా పుడతాడని.. ఇంకా రకరకాల కాన్సెప్టులు వినబడుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ కూడా బయటకి వచ్చింది. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో మూడవ ప్రపంచ యుద్ధం గురించి ఉండనుందట. 

 

అదేంటి మూడవ ప్రపంచ యుద్ధం ఇంకా జరగలేదు కదా అంటారా.. అదే మరి కథ. టైమ్ ట్రావెలర్ లో ప్రభాస్ భవిష్యత్తులోకి వెళ్తాడేమో... అక్కడే మూడవ ప్రపంచ యుద్ధం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాపై జనాలకి చాలా ఆసక్తి ఉంది. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ నటి దీపికా పదుకునేని తీసుకోనున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: