సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా గురించి రోజుకో వార్త వినిపిస్తుంది. మైత్రీ మూవే మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ ప్రేక్షకుకి కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండనున్నాయట. డైలాగ్స్, ఎలివేషన్స్ తో పాటు పాటలు కూడా మంచి  కిక్ ఇచ్చేలా ఉంటాయని అంటున్నారు.

 

ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ అనూహ్య స్పందన వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో మహేష్ బాబు మొహం కనిపించకుండా దాచేసినా, ఈ సినిమాలో చాలా ఫ్రెష్ గా కనిపించబోతున్నాడని, ఇంతకుముందెన్నడూ చూడనంత స్టైలిష్ గా చూడబోతున్నామని తెలుస్తుంది. చెవికి పోగు కానీ, మెడ మీద రూపాయి నాణెం టాటూ చూస్తుంటే స్టైలిష్ తో పాటు సమాజానికి సందేశాన్నిచ్చేలా ఉండబోవచ్చని అంచనా వేస్తున్నారు.

 

అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో విలన్ గా కన్నడ నటుడు కిచ్చ సుదీప్ ని తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ తాజాగా మరో కన్నడ నటుడి పేరు ప్రస్తావనకి వచ్చింది. తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఉపేంద్ర ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడని అంటున్నారు. అయితే కన్నడ నటుల పేర్లే బయటకి రావడానికి పెద్ద కారణం ఉందని తెలుస్తుంది.

 

సర్కారు వారి పాటని తెలుగుతో పాటు కన్నడలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అందుకే తమ సినిమాలో కన్నడ స్టార్లని పెడితే అక్కడ మరింత మైలేజ్ తీసుకురావచ్చని భావిస్తున్నారట. మరి కన్నడ చిత్ర పరిశ్రమ నుండి ఎవరిని తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: