మనం నివసించే సమాజంలో కొన్ని సంఘటనలు హృదయాలను కలచి వేస్తుంటాయి.  ముఖ్యంగా సెలబ్రీల విషయంలో ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. తమ అభిమాన నాయకుడు, హీరో మరెవరైనా చనిపోతే అది భరించలేక చనిపోయిన అభిమానులు ఉన్నారు.  పదే పదే తమ అభిమాన నటులు, నాయకుల ఫోటోలు కనిపించడం ఇందుకు మరో కారణం కూడా అయి ఉండొచ్చు.  బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఒక్కసారే సినీ ఇండ్ట్రీ షాక్ కి గురైంది. ఎంతో భవిష్యత్ ఉన్న హీరో.. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు.. మరి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రశ్నలే తొలచి వేశాయి. 

 

తాజాగా బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెడ్​బాడీ ఫొటోలు ఆన్​లైన్ లో, సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని మహారాష్ట్ర సైబర్ క్రైం పోలీసులు కోరారు. సుశాంత్ సింగ్ డెడ్​బాడీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పలువురు తీవ్రంగా కలత చెందుతున్నట్లుగా గుర్తించామన్నారు. అంతే కాదు ఇప్పటికే పోస్ట్ చేసిన ఫొటోలను తొలగించాలని అధికారులు సూచించారు. 

 

ఇక ఈ రోజు ఆ నివేదిక వెల్లడైంది. సుశాంత్ ఉరి వల్ల ఊపిరాడకే చనిపోయినట్లు ముంబైలోని కూపర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.  మెడకు తాడు బిగుసుకుపోవడంతో  శ్వాస ఆడలేదని, నరాలు చిట్లి  చనిపోయాడని నివేదికలో తెలిపారు. నిన్నటి నుంచి పోస్ట్‌మార్టం నివేదికలో ఏం వస్తుందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూశారు.. అయితే సుశాంత్ ఉరి వల్ల ఊపిరాడకే చనిపోయినట్లు డాక్టర్లు నివేదిక ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: