బాలీవుడ్ లో ఈ మద్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత నెల ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ లు అనారోగ్యంతో కన్నుమూశారు.  సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య యావత్‌ సినీ ప్రపంచాన్ని తీవ్రంగా కలచి వేసింది. యువకుడు, ఎంతో మంచి భవిష్యత్‌ ఉన్న నటుడు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.  బుల్లితెర నటుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టిన ఈ యువ హీరో తర్వాత ‘ధోని’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న ఆయన మృతి చెందిన ప్రాంతంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరక్కపోవడంతో... ఎందుకు సూసైడ్ చేసుకున్నాడనేది అంతుపట్టని విషయంగా మారిపోయింది.

ఆయన ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుందా? అంటూ ఎవరికి తోచిన రీతిలో వారు ఆలోచించడం మొదలుపెట్టారు.  అయితే సుశాంత్ ఆత్మహత్య అన్న విషయం బయటకు పొక్కగానే వెంటనే గుర్తుకు వచ్చించి ఆయన ప్రియురాలు బాలీవుడ్ నటి రియా చక్రవర్తి మెదిలింది. సుశాంత్ తో రియా కలిసిన ఉన్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మార్చ్ 11న ఫొటో తీసినట్టు  తెలుస్తోంది.

IHG

ముంబైలోని ఓ జిమ్ వెలుపల ఈ ఫొటోను తీశారు.  గత కొంత కాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రియాను విచారించేందుకు ముంబై పోలీసులు  సిద్ధమవుతున్నారు. ఇద్దరి మధ్య ఉన్న సంబంధంపై విచారణలో ప్రశ్నించనున్నారు.  అయితే సుశాంత్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి.. ఊపిరి ఆడకపోవడం (asphyxia) వల్లే ప్రాణాలు కోల్పోయాడని తేలింది. ఏది ఏమైనా మంచి భవిష్యత్ ఉన్న తమ అభిమాన హీరో చనిపోవడంతో శోకసంద్రంలో మునిగిపోయారు అభిమానులు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: