టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టిస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’.యంగ్ టైగర్ ఎన్.ట్.ఆర్ కొమరం భీం గా, మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజుగా శక్తి వంతమైన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటి ఆలియా భట్ నటిస్తుండగా సీనియర్ నటుడు అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 

 

అంతేకాదు ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒలివియా మోరిస్ తో పాటు మరికొన్ని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటులు.. రే స్టీవెన్‌ సన్‌ ను, ఐరిష్ నటి అలిసన్ డూడీ లని ఎంచుకున్నారు రాజమౌళి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇటీవల కొన్ని మీడియా సమావేశాలలో పాల్గొంటు ఒక్కొక్క పాత్ర కి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడిస్తు సినిమా మీద బజ్ పెంచే ప్రయత్నం చేశారు. 

 

ఇక అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు అజయ్ దేవగణ్  కి జంటగా శ్రియా శరణ్ నటించబోతుంది. ఈ విషయం రీసెంట్ గా శ్రియా వెల్లడించింది. అయితే ఇంత భారీ తారగణం ఉన్న ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టడానికి మాత్రం పరిస్థితులు అనుకూలించడం లేదని తెలుస్తుంది. అందుకు కారణం ఎన్టీఆర్, రాం చరణ్ తప్ప మిగిలిన నటులందరు దాదాపుగా బాలీవుడ్ అండ్ హాలీవుడ్ నటులే.

 

ఇదే పెద్ద సమస్యగా మారిందట. ఇక ఎన్టీఆర్, రాం చరణ్ తో సీన్స్ తీసే ముందు రెండు రోజులు ట్రయల్ షూట్ నిర్వహించబోతున్నారట. ఇది సక్సస్ అయితేనే ఎన్టీఆర్, రాం చరణ్ సెట్స్ లో కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీన్ని బట్టి రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ప్లాన్స్ ఉంటాయట. ఇక 2021 సంక్రాతికి పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవడం కష్టమని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: