టాలీవుడ్ లో అనిల్ రావిపూడి కి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ రాలేదన్న సంగతి తెలిసిందే. రాజమౌళి, కొరటాల శివ తర్వాత ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి మంచి పేరు సాధించాడు. నందమూరి కళ్యాణ్ రాం తో తెరకెక్కించిన పటాస్ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు అన్ని మంచి కమర్షియల్ సక్సస్ ను అందుకున్నాయి. చెప్పాలంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో సక్సస్ ఫుల్ డైరెక్టర్స్ గా రాజమౌళి, కొరటాల శివ తర్వాత ఆ క్రెడిట్ అనిల్ రావిపూడి కి మాత్రమే దక్కిందని చెప్పాలి.

 

అయితే ఈ సక్సస్ ఫుల్ డైరెక్టర్ కి ఇప్పుడు పెద్ద టాలీవుడ్ లో ఊహించని సమస్య వచ్చి పడిందట. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో ఇంతకు ముందు అనిల్ రావిపూడి ఎఫ్ 2 ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి సంచలనం అయింది. దాంతో ఈ మల్టీస్టారర్ కి సీక్వెల్ గా ఎఫ్ 3 ని నిర్మించాలని దిల్ రాజు అప్పుడే ప్లాన్ చేశాడు.

 

అయితే ప్రస్తుతం కరోనా కొట్టిన దెబ్బకి ఈ సినిమా ఈ సంవత్సరం పట్టాలెక్కే అవకాశాలేమీ కనిపించడంలేదని తాజా సమాచారం. ఇప్పటికే దిల్ రాజు నిర్మాణం లో రూపొందిన వి సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. వకీల్ సాబ్ కి ఇంకా కొంత వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేయడమే ఇప్పుడు దిల్ రాజు ముందున్న లక్ష్యం. కాని ఆ సినిమాలు రిలీజ్ ఎప్పుడవుతాయో ఇంకా అర్థం కాని పరిస్థితి నెలకొంది. దాంతో అనిల్ రావిపూడి ఎఫ్ 3 ఈ ఏడాది సెట్స్ మీదకి తీసుకు వెళ్ళడం కుదరనట్టేనని తాజాగా అందిన వార్త. 

 

ఇక వెంకటేష్ ప్రస్తుతం నారప్ప కంప్లీట్ చేయాల్సి ఉంది. అలాగే వరుణ్ తేజ్ బాక్సర్ సినిమాని కంప్లీట్ చేయాలి. ఈ స్టార్ హీరోల దృష్ఠి మొత్తం ఇప్పుడు ఈ సినిమాల మీదే ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యో వరకు వెంకీ, వరుణ్ తేజ్ అలాగే ఇప్పటికే ప్రొడక్షన్ లో సినిమాలని రిలీజ్ చేసే వరకు దిల్ రాజు ఫుల్ బిజీ కాబట్టి ఈ ఏడాదికి అనిల్ రావిపూడి స్క్రిప్టులు రాసుకోవడమే అని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: