బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అటు సినీ అభిమానులు.... సినీ ప్రముఖులతో పాటు ఇటు సామాన్య ప్రజలందరినీ కూడా తీవ్రంగా కలిచివేసింది. చాలా మంచి భవిష్యత్తు ఉన్న నటుడు అయిన సుశాంత్ అర్ధాంతరంగా చనిపోవడం అది కూడా ఆత్మహత్య చేసుకోవడం సినీ ఇండస్ట్రీలో ఎవరికీ మింగుడుపడలేదు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరియు జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత కంగనా రనౌత్ మాత్రం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను బాలీవుడ్ పెద్దలు హత్య చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది.

 

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకై తాను సొంతగా మరియు ఒంటరిగా పైకి వచ్చిన కంగనారనౌత్ బాలీవుడ్ ఇండస్ట్రీలో 'నెపోటిజమ్' అంటే.... ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలను ఎదగనివ్వకపోవడం ఉందని మండిపడింది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న గుత్తాధిపత్యం మరోసారి బయటపడింది. గతంలో కూడా సుశాంత్ కు 'కాయ్ పో చే' సినిమాకు బెస్ట్ డెబ్యూ హీరో అవార్డు రావాల్సి ఉంది కానీ అతనికి రానివ్వకుండా రాజకీయాలు చేశారని కంగనా తీవ్రమైన ఆరోపణలు చేసింది. రెండు నిమిషాల నిడివిగల వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన కంగన బాలీవుడ్ పై విమర్శలు గుప్పించింది..

 

ఒకానొక సమయంలో తన సినిమాలను చూడమని సుశాంత్ అభిమానులను విజ్ఞప్తి చేశాడు. తనకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరని.. సినిమాలు ఆడకపోతే తనను ఇండస్ట్రీ బయటికి తోసేస్తారని వాపోయాడని కంగనా రనౌత్ తెలిపారు. ఆఖరికి నాపైనా కూడా ఆరు కేసులు బనాయించారు కంగనా చెప్పారు. బాలీవుడ్ పెద్దలు పెట్టిన ఒత్తిదికారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కంగనా మండిపడ్డారు.

 

అయితే కంగనా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సమయంలోనే ఒక అభిమాని సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ను చూసి ఇప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. బాలీవుడ్ పెద్దలెవరు కూడా తనకు తోడుగా లేరని…. మరియు పార్టీలకు, ఫంక్షన్ లకు అసలు తనని పిలవరని గతంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పెట్టిన ఒక పోస్ట్ ను అతను షేర్ చేశాడు. దీనితో నెటిజన్లు సుశాంత్ ఆత్మహత్య విషయంలో అలియాభట్ మరియు నిర్మాత కరణ్ జోహార్ లకు సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: