గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈసినిమాకు డైరెక్టర్. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా. ఇక క్రేజీ కాంబినేషన్ కావడంతో  సినిమా స్టార్ట్ అయ్యే ముందే భారీ హైప్ వచ్చింది అదే ఊపు సినిమా విడుదలయ్యాక  కూడా కొనసాగడంతో ఇస్మార్ట్ శంకర్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు రామ్.
 
ఇక మరోసారి అలాంటి ఫలితాన్నే రిపీట్ చేయాలనుకుంటున్నాడు రామ్. ఇందుకోసం కిక్, రేస్ గుర్రంతో స్టైలిష్ డైరెక్టర్ గా మారిన సురేందర్ రెడ్డి తో  సినిమా చేయడానికి రామ్ ఆసక్తి చూపిస్తున్నాడట. ఇప్పటికే సురేందర్ రెడ్డి, స్టోరీ లైన్ ను కూడా వినిపించగా రామ్ సినిమాకు ఓకే చెప్పాడట దాంతో సురేందర్ ప్రస్తుతం స్క్రిప్ట్ ను ఫినిష్ చేసే పనిలో వున్నాడు. ఆ స్క్రిప్ట్ తో రామ్ ను ఇంప్రెస్ చేయగలిగితే  వీరి కాంబినేషన్ సెట్ అయినట్లే.. 
 
ఇక ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ నటించిన చిత్రం రెడ్ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా వుంది. కరోనా లేకుంటే ఏప్రిల్ 9నే విడుదలయ్యేది కానీ ఈ మహమ్మారి వల్ల వాయిదాపడింది కాగా ఇటీవల ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలకానుందని వార్తలు వచ్చాయి కానీ రామ్ అందుకు ఒప్పుకోక పోవడంతో ఆప్రయత్నాలు ఆగిపోయాయి. థియేటర్లు తెరుచుకోగానే ఈసినిమాను విడుదలచేయనున్నారు.
 
కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈచిత్రంలో రామ్ సరసన మాళవిక శర్మ, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తడంకు రీమేక్ గా తెరకెక్కిన ఈచిత్రాన్ని రామ్ బాబాయ్ స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: