తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సస్ ట్రాక్ ని మేయిన్‌టైన్ చేస్తున్న డైరెక్టర్  కొరటాల శివ. దర్శకుడిగా ప్రభాస్ తో మిర్చి సినిమా తీసి అద్భుతమైన సక్సస్ ని అందుకున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించడమే కాదు ప్రభాస్ కి భారీ మాస్ అండ్ కమర్షియల్ హిట్ ని ఇచ్చింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ చెప్పిన కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అన్న ఒక్క డైలాగ్ ప్రభాస్ క్యారెక్టర్ ని బాగా ఎలివేట్ చేసింది. అంతేకాదు ఆ డైలాగ్ రియల్ లైఫ్ లో కూడా పర్‌ఫెక్ట్ గా సెట్ అయింది.  

 

ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో శ్రీమంతుడు, ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్, మహేష్ బాబు తో భరత్ అనే నేను తీసి బ్యాక్ టు బ్యాక్ హిట్ సాధించారు. కొరటాల వరసగా స్టార్స్ తో తీసిన సినిమాలతో సక్సస్ ట్రాక్ ని మేయిన్‌టైన్ చేయడమే కాదు ప్రతీ హీరోకి భారీ కమర్షియల్ హిట్ ఇవ్వడం ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయోలా చేసింది. దాంతో కేవలం ఆ ముగ్గురు హీరోలే కొరటాల తో మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇక రాం చరణ్, అల్లు అర్జున్ ..ఎప్పుడెప్పుడు కొరటాల తో సినిమా చేస్తామా అన్న ఆసక్తితో ఉన్నారు.  

 

ఇక మెగాస్టార్ చిరంజీవి తో కొరటాల ప్రస్తుతం ఆచార్య సినిమాని రూపొందిస్తున్నారు. అయితే కరోనా విపత్కరం తో ఇప్పుడు ఆచార్య సినిమా కి ఒక్కసారిగా అన్ని సమస్యలు చుట్టు ముట్టాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆచార్య ని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలంటే పెద్ద డైలమాలో ఉన్నారట. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాని ఆయన లేకుండా సీన్స్ తీద్దామన్నా మిగతా నటులు సిద్దంగా ఉన్నారా అంటే అనుమానం అని అంటున్నారు.

 

ఇక హీరోయిన్ గా కాజల్ నటిస్తున్నప్పటికి తనని హైదరాబాద్ తీసుకు రావాలన్న పెద్ద సమస్యే అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో చరణ్ మెగాస్టార్ మీద చిత్రీకరించాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. కాని చరణ్ ఆర్.ఆర్.ఆర్ లో పాల్గొనడానికే ప్లాన్స్ వర్కౌట్ కావడం లేదని టాక్. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆచార్య ని ఎలా సెట్స్ మీదకి తీసుకు వెళతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: