తెలుగులో స్టార్ హీరోతో ఒక సినిమా చేసి అది హిట్ అయితే చాలు హీరోయిన్ లు ఇక ఏ మాత్రం కూడా ఆలోచించే పరిస్థితి ఉండదు అనే విషయం అందరికి తెలిసిందే. అగ్ర హీరోతో ఒక్క సినిమా చేస్తే చాలు ఇక ఆమె హీరోయిన్ గా ఆలోచించే పరిస్థితి ఉండట్లేదు.. రెమ్యునరేషన్లు చుక్కలో చూపించేస్తున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో అలా స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయిన హీరోయిన్ లు ఇద్దరు ఉన్నారు.
ఆ ఇద్దరే పూజ హెగ్డే.. రష్మిక మందన. ఈ ఇద్దరు టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ లు అన్న టాక్ రావడంతో వీరు చుక్కలు దిగి రావడం లేదట. అయితే ఇప్పుడు అదే వాళ్ళ కొంప ఆర్పేసింది అని అంటున్నారు. ఇద్దరూ కూడా వరుస విజయాలు రావడంతో ఇప్పుడు రేటు భారీగా పెంచేశారు ఈ మధ్య కాలంలో. దీంతో ఇప్పుడు వాళ్లకు వచ్చిన అవకాశాలు కూడా వీళ్లను దాటి వెళ్తున్నాయి అని అంటున్నారు.
అవును ఇప్పుడు వాళ్లకు అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు కూడా వాళ్ళను వద్దు అని చెప్తున్నట్టు సమాచారం. పుష్ప సినిమాకు రష్మిక 3 కోట్లు అడిగింది. సరే మళ్ళీ చెప్తామని ఆమెను పక్కన పెట్టారట. పూజ ఇప్పుడు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమాకు రు. 4 కోట్ల వరకు అడిగింది. దీంతో ఇప్పుడు దర్శక నిర్మాతలు మీరు మా సినిమాల్లో అవసరం లేదు... ఆ రేటుకి బాలీవుడ్ హీరోయిన్ లు వస్తారు అని పక్కన పెట్టారు. ఇక ఈ విషయం తెలిసి వేరే వాళ్ళు కూడా వీళ్లను వద్దు అనే పరిస్థితి వచ్చేసిందట.