ఇప్పుడు టాలీవుడ్ లో కొందరు హీరోలు సినిమాల షూటింగ్ విషయంలో దూకుడుగా ఉన్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల సిఎం లను కలిసిన సినీ పెద్దలు సినిమాల షూటింగ్ లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలను  ఒప్పి౦చి సినిమాలను చెయ్యాలి అని ప్లాన్ చేసారు. అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్ళడానికి దాదాపుగా సిద్దంగానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పుడు చాలా వరకు స్టార్ హీరోలు సినిమాల షూటింగ్ విషయంలో వెనక్కు తగ్గుతున్నారు అని అంటున్నారు. 

 

అవును మహేష్ బాబు షూటింగ్ కి వెళ్ళడం లేదు. కరోనా తగ్గిన తర్వాతే షూటింగ్ అని నమ్రత చెప్పినట్టు సమాచారం. ఇక తారక్ విషయంలో కూడా దాదాపుగా అదే జరుగుతుంది అని తెలుస్తుంది. లక్ష్మీ ప్రణతి అసలు షూటింగ్ లు ఇప్పుడు వద్దు అని రిస్క్ అవసరం లేదు అని ఆమె చెప్పారట. ఇక చిరంజీవి కూడా వయసు ప్రభావం తో సినిమా షూటింగ్ లకు దాదాపుగా దూరంగా ఉన్నారు అని తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ ని కూడా చిరంజీవి షూటింగ్ కి దాదాపుగా వద్దు అంటున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రభాస్ కూడా ఇప్పట్లో షూటింగ్ చేసే సూచనలు అయితే దాదాపుగా లేవు అని అంటున్నారు. 

 

ఇక పోతే హీరోయిన్ లు కూడా షూటింగ్ లకు వచ్చే అవకాశాలు దాదాపుగా లేవు అని అంటున్నారు జనాలు. చాలా మంది హీరోయిన్ లు తమ సొంత రాష్ట్రాల నుంచి రావడం లేదు అని సమాచారం. దీనిపై ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతుంది మరి. ఎప్పుడు షూటింగ్ లకు వస్తారు అనేది చూడాలి. అసలు షూటింగ్ లు ఇప్పట్లో ఉంటాయా లేదా అనేది చూడాల్సి ఉంది. మరి ఏమవుతుందో త్వరలోనే స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: