లెక్కల మాస్టారు సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు కాంబినేషన్ లో పుష్ప అన్న భారీ బడ్జెట్ సినిమా రూపుందుతుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసే విధంగా చిత్రీకరణ జరుపుతున్నారు. అయితే ఈ సినిమాని మొదలు పెట్టి ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసిన సుకుమార్ నెక్స్ట్ షెడ్యూల్ ని కేరళ లో ప్లాన్ చేశారు. దాదాపు 40 రోజులకి పైగా అక్కడ దట్టమైన అడవుల్లో షూటింగ్ ప్లాన్ చేశారు. అలాగే విదేశాలలోను షెడ్యూల్స్ ప్లాన్ చేసిన సుకుమార్ కరోనా కారణంగా అన్ని షెడ్యూల్స్ ని క్యాన్సిల్ చేశారు. ఇప్పటికే ఈ షెడ్యూల్స్ క్యాన్సిల్ చేయడం వల్ల నిర్మాతలకి 3 కోట్ల వరకు నష్టం వచ్చిందని సమాచారం. 

 

ఇక జూలై నెలాఖరు నుంచి లేదా ఆగస్టు నుంచి తిరిగి షూటింగ్ మొదలు పెట్టాలని అన్ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. కేరళ వంటి దట్టమైన అడవులని తలపించేలా హైదరాబాద్ లో సెట్ నిర్మిస్తున్నారట. అన్నపూర్ణ స్టూడియోస్, అలాగే భూత్ బంగళ ఏరియాలలో అడవి సెట్ తో పాటు వేరే సెట్స్ ని రూపొందిస్తున్నారట. ఇందుకోసం భారీగానే ఖర్చు అవుతుందని తెలుస్తుంది. అయినా సుకుమార్ కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తుంది. పుష్ప షూటింగ్ జరగాలంటే ఈ సెట్స్ తపనిసరి అని పట్టు బట్టాడట.  

 

అయితే నిర్మాతలు సుకుమార్ మీద నమ్మకంతో ముందడుగు వేశారని సమాచారం. సుకుమార్ కి కావలసినట్టుగా సెట్స్ ని తయారు చెయిస్తున్నారట. ఈ సెట్ లో అల్లు అర్జున్ తో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటుందని సమాచారం. ఇక బన్నీ కూడా ఎంతో ఆసక్తిగా పుష్ప సెట్ లోకి రావడానికి సిద్దంగా ఉన్నాడట. అయితే రష్మిక మందన్న విషయంలో కొంత డైలమా నెలకొందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో షూటింగ్ లో జాయిన్ కాలేనని చెప్పినట్టు ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తుండగా సుకుమార్.. దేవీ.. బన్నీ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: