ఇటీవలే కన్నడ హీరో చిరంజీవి హఠాత్మరణం అందరిని  కలిచి వేసిన విషయం తెలిసిందే. కన్నడ హీరో చిరంజీవి సర్జా హఠాత్ మరణం నుంచి ఆయన కుటుంబం ఇంకా బయటికి రాలేకపోతున్నది . ఆయన జ్ఞాపకాల తోనే ఇంకా కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన హఠాత్ మరణంని  కుటుంబసభ్యులు ఇప్పటికికూడా నమ్మలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు చిరంజీవి సతీమణి మేఘన రాజ్  సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ లేఖను పంచుకున్నారు. ఈ లేక ఎంతో మంది నెటిజన్లను హృదయం ద్రవింప  పనిచేసేలా చేస్తుంది. ఎంతోమందిని కంట నీరు పెట్టిస్తుంది. 

 

 చిరు నీకు ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది... కానీ ఎంత ప్రయత్నించినా దాన్ని మాటలలో వర్ణించ లేక పోతున్నాను... నువ్వు నాకు ఎంత ముఖ్యం అనే విషయాన్ని ప్రపంచంలో ఏదీ కూడా వర్ణించలేదు.. ఒక స్నేహితుడిగా ఒక ప్రేమికుడిగా ఒక జీవిత భాగస్వామిగా చంటి పిల్లాడిగా... నా ధైర్యంగా.. నా భర్తగా... వీటన్నింటి కన్నా ఎక్కువే. నువ్వు నా ప్రాణం... కానీ ఏదో ఒక బాధ ప్రతి క్షణం నన్ను చిత్రవధ చేస్తోంది. నువ్వు ఇక లేవు అన్న నిజం గుర్తొచ్చినప్పుడల్లా ప్రతి క్షణం నా మనసు కుమిలి కుమిలి ఏడుస్తోంది. నువ్వు లేవు అనేది గుర్తొచ్చినప్పుడల్లా చనిపోతున్నంత  నరకంగా ఉంది.

 


 కానీ నా చుట్టూ ఏదో మంత్రం వేసినట్లు గా అనిపిస్తోంది. నేను దిగులుపడ్డ ప్రతిసారి కూడా నువ్వు నన్ను రక్షించేందుకు నా చుట్టే ఉన్నావేమో అనిపిస్తుంది. నన్ను ఎంతగానో ప్రేమించావు... నా చేయి ఎప్పటికీ వదలను అంటూ మాటిచ్చావు... కానీ చివరికి మధ్యలోనే నన్ను వదిలి వెళ్ళిపోయాv... నాకు పాప ఇస్తున్నందుకు నీకు చిరకాలం కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటాను... మన బిడ్డగా నిన్ను  మళ్ళీ భూమి పైకి తీసుకురావడానికి ఎంతగానో తహతహలాడుతున్నాను . నీతో కలిసి జీవించేందుకు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాను... నేను నీకోసం ఎదురుచూస్తూనే ఉంటా చిరు  అంటూ ఐ లవ్ యు అంటూ రాసిన లేఖ  ప్రస్తుతం నెటిజన్లను సైతం కంటతడి  పెట్టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: