రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రారంభమై ఏడాది దాటుతున్నఇంతవరకు  మేకర్స్ అఫిషియల్ గా ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు దాంతో ఇటీవల ప్రభాస్ ఫ్యాన్స్ పలు సార్లు యూవీ క్రియేషన్స్ ను ట్రోల్ చేశారు. ఇక వారి ఒత్తిడికి తలొగ్గి  యూవీ ఎట్టకేలకు ఫస్ట్ లుక్ ను విడుదలచేయాలని డిసైడ్ అయ్యింది. తాజాగా ఆ ఫస్ట్ లుక్ ను కూడా లాక్ చేశారట అయితే విడుదలకు సరైన సమయం కోసం చూస్తున్నారు. అన్ని కుదిరితే ఈనెల 22న ఈ ఫస్ట్ లుక్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని ఫిలిం నగర్ టాక్. అతి త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలుబడనుంది. ఫస్ట్ లుక్ తోపాటు ఈసినిమా టైటిల్ ను కూడా రివీల్ చేయనున్నారు.టైటిల్ కోసం రాదే శ్యామ్ ,ఓ డియర్ పేర్లు పరిశీలనలో వున్నాయి. 
 
ప్యూర్ లవ్ స్టోరీ గా జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఇప్పటివరకు ఈచిత్రం 40శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది అయితే కరోనా నేపథ్యంలో ఇప్పుడప్పుడే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు. గోపి కృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంపిక చేయాల్సివుంది.
 
ఇక ఈసినిమా తరువాత ప్రభాస్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో తన 21వ సినిమా చేయనున్నాడు.సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈచిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించనున్నాడు.   

మరింత సమాచారం తెలుసుకోండి: