బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణాంతరం ఎంతో మంది సెలబ్రిటీలు.. సినీ ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి పెదవి విప్పుతున్నారు. తాజాగా నటి అయేషా టాకియా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. కెరీర్‌ పరంగా తాను కూడా ఎన్నోసార్లు బెదిరింపులు ఎదుర్కొన్నానని తెలిపారు. కుంగుబాటుకు గురిచేస్తోన్న వారి గురించి బయట ప్రపంచానికి తెలియజేయాలని సూచించారు.

 

 

" ఎన్నో సందర్భాల్లో ట్రోలింగ్‌, బెదిరింపులు ఎదుర్కొన్నా. ఒకవేళ ఏదైనా సందర్భంలో ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వారి గురించి ధైర్యంగా బయటపెట్టండి. అలాంటి వ్యక్తుల మాటలు పట్టించుకుని మీపై మీరు నమ్మకాన్ని కోల్పోకండి. మీకు దక్కాల్సిన దాని గురించి పోరాటం చేయడానికే ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని గెలవనివ్వకండి. వారి గురించి ఆన్‌లైన్‌ వేదికగా బయటపెట్టండి. ఇలాంటివి చేయడం కంటే చెప్పడం చాలా తేలిక అని నాకు తెలుసు. కానీ, మన భవిష్యత్తు తరాల కోసం ఈ ప్రపంచాన్ని దయగల మంచి ప్రదేశంగా మారుద్దాం. దయచేసి మరొకరి పట్ల దయ, సున్నితంగా వ్యవహరించండి. ఎందుకంటే అవతలి వ్యక్తి ఎంతటి బాధలో ఉన్నారో మీకు తెలియదు కదా." అని ఈ విధంగా  అయేషా టాకియా  స్పందించారు.

 

 

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన 'సూపర్‌' సినిమాలో అయేషా నటించారు. ఈ చిత్రంలో ఆమె నాగార్జున సరసన మెప్పించారు. దీనిలో ఆమె సిరివల్లి అనే వైద్యురాలి పాత్రలో కనిపించారు. 2005లో విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందన లభించింది. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో నటించలేదు.ఈ సినిమాలో ఒక పాట లో అందాల ఆరబోత చేసిన తరువాత కూడా అయేషా కు ఎటువంటి అవకాశాలు రాలేదు. ఇప్పటి వరకు చాలా సందర్భాలలో అనేక మంది నటీనటులు వారికి ఇండస్ట్రీ లో జరిగిన అనేక జ్ఞాపకాలను బాధలను పంచుకున్నారు. కానీ ఎన్నడూ లేనివిధంగా ఈనాటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: