మూడు రోజుల క్రితం యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. డిప్రెషన్ లోనే సుశాంత్ , ఉరి వేసుకున్నాడని  పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అయితే సుశాంత్ ను మానసికంగా ఎవరు వేదించారనే విషయం లో మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇక సుశాంత్ మరణం అటు బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. నెపోటిజం కారణంగానే సుశాంత్ డిఫ్రెషన్ లోకి వెళ్లాడని కొందరు కావాలనే  సుశాంత్ ను పక్కకు పెట్టారని.. ఇవి భరించలేక సుశాంత్ ఆత్మహత్య చేసుకొన్నాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా ఈ వార్తలకు బలం చేకురేలా మాట్లాడడంతో సుశాంత్, నెపోటిజం వల్ల అలా చేసుకున్నాడని నెటిజన్లు బలంగా నమ్ముతున్నారు. 
 
ఇక నెపోటిజంలో ఎక్కువగా నిర్మాత కరణ్ జోహార్ పేరు ఎక్కువగా వినబడుతుంది. ట్యాలెంట్ వున్న వాళ్ళని  పక్కకు పెట్టి స్టార్ కిడ్స్ కు మాత్రమే అవకాశాలు ఇస్తున్నాడంటూ అతని పై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు కరణ్ సోషల్ మీడియా  అకౌంట్లను అన్ ఫాలో చేస్తున్నారు. ఇక సుశాంత్ ప్రభావం అందరికంటే ఎక్కువగా హీరోయిన్ ఆలియా భట్ పై పడుతుంది.
 
గతంలో కొన్ని సార్లు సుశాంత్ గురించి చులకనగా మాట్లాడింది ఆలియా. ఇప్పుడు ఆ వీడియో లను పోస్ట్ చేస్తూ  నెటిజన్లు ,అలియా సోషల్ మీడియా అకౌంట్ల ను అన్ ఫాలో చేస్తున్నారు. గంటకు సుమారు 20000 చొప్పున ఆలియా ఫాలోవర్లను కోల్పోతుంది. ఇంతకుముందు ఆలియాకు ఇంస్టాగ్రామ్ లో 48.9 ఫాలోవర్స్ ఉండేవారు అయితే సుశాంత్ సంఘటన తరువాత ఇప్పుడు ఆసంఖ్య 47.8 కు చేరింది. ఆలియా తోపాటు సోనమ్ కపూర్ ,సల్మాన్ ఖాన్ లు కూడా భారీ గా ఫాలోవర్లను కోల్పోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: