డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలియాన నటించిన సినిమా పోకిరి. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా 75 ఏళ్ళ ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ పూరి కాంబోలో బిజినెస్ మాన్ సినిమాని చేయగా భారీ సక్సస్ ని అందుకుంది. దాంతో పూరి మహేష్ బాబు మరో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చాలా సార్లు ప్లాన్ చేసుకున్నారు.

 

మహేష్ కోసమే పూరి రాసిన ఈ సినిమాని జనగణమన టైటిల్ తో తెరకెక్కిస్తానని పూరి చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ సినిమాని మహేష్ బాబు తో తప్ప మరెవరితో చేయనని పూరి పట్టుదలగా ఉన్నాడు. అయితే ఎందుకనో ఎన్నిసార్లు అనుకున్నా కూడా ఈ ఇద్దరి కాంబినేషన్ లో మాత్రం హ్యాట్రిక్ సినిమా ట్రాక్ లోకి రావడం లేదు.

 

అయితే ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టిన తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ కొంతమంది పూరి ని మీరు మళ్ళీ మహేష్ బాబు తో పోకిరి లాంటి సినిమాని ఎప్పుడు తీస్తారు అని అడిగారు. వాళ్ళు అడిగిందే తడవుగా పూరి వెంటనే మహేష్ నాతో ఇప్పుడు సినిమా చేయడు ..తను సక్సస్ లో ఉన్న డైరెక్టర్స్ తో నే సినిమా చేస్తాడని సెన్షేనల్ కామెంట్స్ చేశాడు. పూరి ఇలా కామెంట్స్ చేశాడో లేదో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. కొంతమంది మహేష్ ఫ్యాన్స్ పూరి ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ కూడా చేశారు. 

 

ఆ దెబ్బతో మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్..ఇండస్ట్రీ వర్గాలు ఇక పూరి మహేష్ బాబు తో హ్యాట్రిక్ సినిమా ఉండదనుకున్నారు. కాని మహేష్ రీసెంట్ గా ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ నాకు ఇష్టమైన దర్శకులలో పూరి జగన్నాధ్ ఒకరు ..తనకోసం వేయిట్  చేస్తున్నాను..ఆయన వచ్చి కథ చేప్తే నేను రెడీ అంటూ ప్రేక్షకులకు షాకిచ్చాడు. మహేష్ బాబు ఇలా చెప్పాడో లేదో అందరూ త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా జనగణమన ఉంటుందని ఫిక్సైపోయారు.

 

అంతేకాదు పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత మహేష్ తోనే ఉండబోతుందని సంబర పడ్డారు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో సూపర్ స్టార్ సర్కారు వారి పాట ఎప్పుడు ట్రాక్ లోకి వస్తుందో తెలియని పరిస్థితి. అయినా 2021 సమ్మర్ వరకు మహేష్ బాబు వేరే సినిమా చేయలేరన్న టాక్ కూడా తాజాగా వినిపిస్తుంది. అంటే ఇప్పట్లో పూరి మహేష్ సినిమా ఉండదని ఫిక్సవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: