ఢిల్లీ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో వరసగా నాలుగేళ్ళు ఒక వెలుగు వెలిగింది. కెరటం సినిమాతో పరిచయమై టాలీవుడ్ లో యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో సూపర్ హిట్ అందుకొని అందరి దృష్ఠిని ఆకర్షించింది. ఈ సినిమా తర్వాత రకుల్ దాదాపు నాలుగేళ్ళ పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోకుండా వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. రాం చరణ్ కి లక్కీ హీరోయిన్ గా నిలిచింది. 

 

ఇక తమిళంలోను రకుల్ స్టార్ హీరోల సినిమాలలో నటించి హిట్స్ అందుకుంది. ఈ మధ్యే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ అజయ్ దేవ్ గన్ టబు లతో కలిసి నటించింది. దే దే ప్యార్ దే అన్న టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాతో హిందీలో ఫస్ట్ సక్సస్ ను దక్కించుకుంది. అయితే అదే సమయంలో టాలీవుడ్ లో కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు 2 హీరోయిన్ గా చేసింది. కాని ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. 

 

దాంతో మళ్ళీ ఇప్పటి వరకు తెలుగులో  సినిమా చేయలేదు. అయితే ఈ మధ్య రకుల్ టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని న్యూస్ బాగా వైరల్ అయింది. అయితే ఇందులో వాస్తవం లేదని తాజా సమాచారం. చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తున్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తారని అన్నారు.

 

అయితే ఈ సినిమాలో రకుల్ మాత్రం కన్‌ఫర్మ్ కాదని సమాచారం. అంతేకాదు అదే సినిమాలో  కీర్తి సురేష్ అని అనుకుంటున్నట్టు లేటెస్ట్ న్యూస్. ఇప్పటికే కీర్తి సురేష్ నితిన్ తో రంగ్ దే సినిమాలో నటిస్తుంది. ఈ పేయిర్ అందరిని బాగా ఆకట్టుకోవడంతో నితిన్ చంద్ర శేఖర్ ఏలేటి సినిమాలో కూడా కీర్తిని తీసుకోవాలని భావిస్తున్నారట. మరి నిజంగా రకుల్ అనుకొని కీర్తి ని తీసుకుంటున్నారా లేదా అన్నది తెలియదు గాని రకుల్ ఛాన్స్ కీర్తి దక్కించుకుందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: