యువి క్రియోషన్ లో ప్రభాస్ నటించే సినిమాలతో పాటు బయట హీరోలతో సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చెప్పాలంటే యువి నిర్మాణ సంస్థ ప్రభాస్ సొంత సంస్థ అని అందరూ చెప్పుకుంటారు. ఇందులో ప్రభాస్ పెట్టుబడులు పెడతాడన్న విషయం కూడా దాదాపు అందరికి తెలిసిందే. ఇక ఈ బ్యానర్ లో ఇప్పటికే సక్సస్ ఫుల్ సినిమాలతో పాటు సాహో వంటి పాన్ ఇండియా సినిమా కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ కాంబినేషన్ లో మరో భారీ బడ్జెట్ సినిమా రూపొందుతుంది. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా నటిస్తుంది.

 

ఇక తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ యువి సంస్థలో ఇద్దరు యంగ్ హీరోలతో మల్టీ స్టారర్ ని ప్లాన్ చేస్తున్నాడని లేటెస్ట్ న్యూస్. ఆ హీరోలే శర్వానంద్, విజయ్ దేవరకొండ. ఇప్పటి వరకు శర్వానంద్ యువి బ్యానర్ లో రన్ రాజా రన్, మహానుభావుడు చేశాడు. ఇప్పుడు సోలో హీరోగా మరో సినిమా చేయబోతున్నాడు. అలాగే విజయ్ దేవరకొండ గతంలో టాక్సీవాలా చేశాడు. ఇప్పుడు ఈ ఇద్దరికోసం కథ సిద్దమవుతుందని సమాచారం. 

 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతుంది. ఇక శర్వానంద్ 'శ్రీకారం' టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' లో నటించనున్నాడు.

 

లాక్ డౌన్ ఎత్తేయగానే శర్వా ఈ సినిమాలోనే నటించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత సోలో సినిమా తో పాటు విజయ్ దేవరకొండ తో కలిసి మల్టీస్టారర్  లో నటిస్తాడట. ఇక మహాసముద్రం కూడా మల్టీస్టారర్ గానే రూపొందుతుంది. ఈ సినిమాలో మరో హీరోగా బొమ్మరిల్లు తో టాలీవుడ్ లో స్టార్ హీరో క్రేజ్ సంపాదించుకున్న సిద్దార్థ్ నటించబోతున్నాడు.  
  

మరింత సమాచారం తెలుసుకోండి: