ఇటీవల భీష్మ తో సక్సెస్ సాధించి ఫామ్ లోకి వచ్చాడు యంగ్ హీరో నితిన్. ఈ సినిమా తరువాత నితిన్ వరస సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో పవర్ పెట్ ఒకటి. నితిన్ తో చల్ మోహన్ రంగ తీసిన దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుందని టాక్. ఇక ఈసినిమా కోసం నితిన్ డిఫ్రెంట్ గెటప్ లలో  కనిపించనున్నాడు. అందులో భాగంగా 20, 40, 60 ఏళ్ళ  వ్యక్తిగా  నితిన్  కనిపించనున్నాడు. ఇందుకోసం  ఓ అంతర్జాతీయ మేకప్ ఆర్టిస్ట్ ను తీసుకున్నారట. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం లో సెట్స్ మీదకు వెళ్లనుంది. 
 
ఇక నితిన్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు అందులో తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి  డైరెక్షన్ లో తెరక్కుతున్న రంగ్ దే ఒకటి. 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు నుండి మళ్ళీ సెట్స్ మీదకు వెళ్లనుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరక్కుతున్నఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా  రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాతో పాటు నితిన్ ,చంద్రశేఖర్ యేలేటి  డైరెక్షన్ లో చెక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆనంద్ ప్రసాద్  నిర్మిస్తున్న ఈచిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.   
 
ఈసినిమాలను పూర్తి చేసి నితిన్, బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ అందదున్ తెలుగులో రీమేక్ ను మొదలు పెట్టనున్నాడు. మేర్లపాక గాంధీ డైరెక్ట్  చేయనుండగా నితిన్ సొంత బ్యానర్  శ్రేష్ట్ మూవీస్ ఈ సినిమాను నిర్మించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: