అప్పుడప్పుడే బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ దక్కించుకుంటున్న కియరా అద్వాని ఎమ్మెస్ ధోని తర్వాత కేవలం సినిమాలే వర్క్ అవుట్ అవదని భావించి వెబ్ సీరీస్ లను చేస్తూ వచ్చింది. లస్ట్ స్టోరీస్ అంటూ కియరా చేసిన క్రేజీ అటెంప్ట్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఆ వెబ్ సీరీస్ తో అమ్మడికి సూపర్ క్రేజ్ వచ్చింది. తెలుగులో కూడా ఇద్దరి స్టార్స్ సరసన నటించిన ఈ అమ్మడు ఇక్కడ కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.

 

అయితే కియరా నటించిన లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అందులో కియరా నటించిన పాత్రలో మన దగ్గర ఈషా రెబ్బ చేస్తుంది. ఆ వెబ్ సీరీస్ లో ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియెన్స్ మనసులు దోచుకున్న కియరా ప్లేస్ లో ఈషా రెబ్బ ఎలా చేస్తుందో అని ప్రేక్షకులు ఎక్సయిటింగ్ ఆ ఎదురుచూస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈషా రెబ్బా కూడా ఆ పాత్రలో హాట్ హాట్ గా కనిపించిందని తెలుస్తుంది.

 

ఓ పక్క సినిమాలు చేస్తున్నా అక్కడ ఆశించిన క్రేజ్ దక్కకపోవడంతో ఈషా రెబ్బ వెబ్ సీరీస్ లకు సైన్ చేస్తుంది. లస్ట్ స్టోరీస్ వర్క్ అవుట్ అయితే మాత్రం ఆమెకు అలాంటి ఆఫర్స్ వరుగా వచ్చే ఛాన్స్ ఉంది. సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లకు ఓకే అంటున్న ఈషా రెబ్బ ఎలాగైనా సరే తన సత్తా చాటాలని చూస్తుంది. తెలుగులో ఈమధ్య కాలంలో సక్సెస్ అయిన తెలుగు అమ్మాయిగా ఈషా రెబ్బ మంచి క్రేజ్ తెచ్చుకుంది. సినిమా ఛాన్సులు వచ్చినా రాకున్నా ఓటిటి ఫ్లాట్ ఫాం లో అమ్మడికి బాగానే క్రేజ్ వచ్చేలా ఉంది. ఈ లాక్ డౌన్ టైం లో ఓటిటి యాక్టర్స్ కు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: