పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'బద్రి' సినిమాతో రేణుదేశాయ్ సినిమా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 'జానీ' సినిమా చేసి పవన్ కళ్యాణ్ ని పెళ్లాడటం జరిగింది. ఆ తర్వాత సినిమా రంగానికి దూరం అయిపోయింది. కాగా కొన్నాళ్లకు పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకోవటంతో చాలావరకు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన స్వస్థలం పూణేకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పలు టీవీ కార్యక్రమాల్లో జడ్జిగా చేస్తూ కెరియర్ కొనసాగించింది. అయినా గాని అవి పెద్దగా ఆశించిన స్థాయిలో రేణు దేశాయ్ కి పేరు తీసుకు రావడం లేదు. ఇటువంటి తరుణంలో రేణుదేశాయ్ మళ్లీ సినిమా రంగంలోకి అడుగు పెట్టడానికి రెడీ అయినట్లు వార్తలు అందుతున్నాయి.

 

మొన్నటి వరకు బుల్లితెరపై అలరించిన రేణుదేశాయ్ త్వరలోనే ముఖానికి రంగు వేసుకుని ఓ ప్రముఖ దర్శకుడు సినిమా లో స్టార్ హీరోకి అక్కగా నటించడానికి రేణుదేశాయ్ ఓకే అన్నట్లు ఫిలింనగర్లో మరియు సోషల్ మీడియాలో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల బద్రి సినిమా రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు అయినా సమయంలో సోషల్ మీడియాలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నీ కూడా సినిమాలో ఒక వేషం ఇప్పించాలని రేణు దేశాయ్ కోరింది.

 

ఖచ్చితంగా మళ్లీ సినిమా ఇండస్ట్రీ లోకి రావాలని ఉందని ఆ సమయంలో పూరి జగన్నాథ్ తో అనేక విశేషాలు పంచుకుంటూ తన మనసులో ఉన్న మాటను బయట పెట్టడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో త్వరలో ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలో కుర్ర హీరో కి అక్క గా రేణు దేశాయ్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు అందుతున్నాయి. మరి వస్తున్న ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో రేణు దేశాయ్ స్పందిస్తే గానీ తెలీదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: