నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలకి సైన్ చేస్తూ దూసుకుపోతున్నాడు. గ్యాంగ్ లీడర్ యావరేజ్ తర్వాత నాని చేసిన "వి" సినిమా కరోనా కారణంగా ఇంకా రిలీజ్ కాలేదు. అయితే ప్రస్తుతం నాని చేతిలో మూడు సినిమాలున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టక్ జగదీష్, రాహుల్ సాంక్రిత్యాయాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్, ఇంకా నూతన దర్శకుడితో విలేజ్ బ్యాక్డ్ డ్రాప్ లో మరో సినిమా తెరకెక్కనుందని సమాచారం.

 

 

అయితే ఈ మూడింటిలో టాక్సీవాలా దర్శకుడు రూపొందించనున్న శ్యామ్ సింగరాయ్ చిత్రం ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. కథా పరంగా సినిమాలో ఎక్కువ భాగం కోల్ కతాలో షూటింగ్ జరుపుకోవాలన్న కారణంగా ఈ సినిమాని పక్కన పెట్టేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. అందులో భాగంగానే ఇందులో నటీనటులని ఎంపిక చేసే పనిలో పడ్డారట.

 

 

శ్యామ్ సింగరాయ్ లో నాని సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారట. స్క్రిప్టు ప్రకారం ఈ కథలో ముగ్గురు హీరోయిన్లు నాని సరసన ఆడిపాడనున్నారట. ముగ్గురు కథానాయికల కోసం ఆరుగురిని ఎంచుకున్నట్టు చెబుతున్నారు. రష్మిక మందన్న,  రాశీ  ఖన్నా, సాయి పల్లవి, నివేథా థామస్, రీతూ వర్మ ఇంకా నిధి అగర్వాల్ పేర్లని ఈ పాత్రల్లో నటింపజేయాలని చూస్తున్నారట. ఈ ఆరుగురిలో నుండి ముగ్గురు హీరోయిన్లని సెలెక్ట్ చేయనున్నారట.

 

 

మొత్తానికి అటకెక్కిందనున్న శ్యామ్ సింగరాయ్ ముందుకు కదలడమే కాదు హీరోయిన్ల ఎంపిక దాకా వచ్చిందంటే ఇక ఎక్కడా ఆగదనే చెప్పాలి. కాకపోతే శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టక్ జగదీష్ చిత్రం పూర్తయ్యాకే శ్యమ్మ్ సింగరాయ్ చిత్రం తెరకెక్కనుంది. చూడాలి శ్యామ్ సింగరాయ్ గా నాని ప్రేక్షకులని ఏ విధంగా మెప్పిస్తాడో..!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: