సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన జీవితంలో జరిగే ప్రతీ విషయాన్ని తన అభిమానులతో, ఫాలోవర్స్ తో పంచుకునే ప్రయత్నం చేస్తుంది కొణిదెల వారి కోడలు ఉపాసనా. రామ్ చరణ్ భార్య అయినా సరే ఆమె మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. ఇక రామ్ చరణ్ కి సంబంధించిన పలు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా తన వైవాహిక జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను ఆమె పంచుకుంది. 

 

తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్  లో పోస్ట్  చేసారు. ఈ మధ్యన తమ 8 వ పెళ్లి రోజుని జరుపుకున్న ఆమె ఈ ఎనిమిదేళ్ళ ప్రయాణం కి సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. ఎన్నో మరుపురాని అనుభవాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. ఈపెళ్లి రోజుని చాలా సింపుల్ గా చేసుకున్నామని పచ్చడి అన్నం తిన్నామని చెప్పింది ఆమె. కేవలం మూడు రకాల పచ్చళ్ళు.. అన్నం, చిప్స్ మాత్రమే తిన్నామని ఆ తర్వాత టీవీ చూసామని ఇంస్టాగ్రామ్ లో చెప్పారు. ఏ విధమైన హంగామా అసలు తమ పెళ్లి రోజు నాడు లేదు అని చెప్పారు ఆమె. 

 

దానికి కారణం ఏంటీ అనేది కూడా ఆమె పంచుకున్నారు. గత 20 రోజులు గా అనేక సంఘటనలతో తాము బాధ పడ్డామని చెప్పారు ఆమె. తమ ఫ్యామిలీ లో ముగ్గురు పెద్ద వాళ్ళను కోల్పోయామని చెప్పారు. అదే విధంగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణం తో పాటుగా దేశ రక్షణ గా ఉన్న జవాన్ లు మరణించడం, కరోనా కేసులు పెరగడం తనను బాగా కలచి వేసింది అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఇవన్నీ చాలా బాధగా ఉన్నాయని చెప్పారు ఆమె.

https://www.instagram.com/p/CBp1TWNDvaF/

 

మరింత సమాచారం తెలుసుకోండి: