టాలీవుడ్ లో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పెద్దగా వార్తల్లో ఉండరు. ఎప్పుడో సోషల్ మీడియాలో మినహా ఆమె కనపడే అవకాశం ఉండదు. ఎన్టీఆర్ కూడా ఆమె గురించి ఎక్కడా చెప్పిన సందర్భం కూడా లేదు అనే చెప్పాలి. సోషల్ మీడియాలోనే అప్పుడప్పుడు ఆమె ఏదైనా ఫంక్షన్ ఫొటోస్ లో కనపడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్ గా ఉన్న సందర్భం ఏదీ లేదు అనే చెప్పాలి. ఇక తారక్ కూడా సినిమా వ్యవహారాల్లో ఆమెను ఎక్కడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయరు. వ్యాపారాల్లో కూడా ఆమె జోక్యం తక్కువ. 

 

అయితే ఇటీవల మాత్రం ఆమె నిర్మాత అవుతున్నారు అని తారక్ వ్యవహారాలూ ఆర్ధికంగా ఆమె చూస్తున్నారు అనే ప్రచారం అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. ఈ విషయాన్ని కరెక్ట్ గా ఎవరూ చెప్పలేదు గాని ఆమె మాత్రం వ్యాపారాలతో పాటుగా తారక్ సినిమాల ఆర్ధిక వ్యవహారాలను చూసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇక ఇప్పుడు అది నిజమే అనే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఏమీ లేదు ఆమె ఒక మీడియా ఛానల్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా వెళ్తున్నారని అంటున్నారు. ఆ మీడియా ఛానల్ లో తారక్ పెట్టుబడి ఉందట. 

 

ఇప్పుడు ఆమె ఆ వ్యవహారాలను దగ్గర ఉండి వాటిని చూసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి ఓ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్‌కు మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా బాధ్యతలు తీసుకోవడం దాదాపుగా ఖరారు అయింది అని టాక్. ఇక ఆ ఛానల్ పేరు యువ అని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని అన్నీ అనుకున్నట్టు గా జరిగితే ఈ ఛానల్ ని హరికృష్ణ పుట్టిన రోజు నుంచి లాంచ్ చేసే అవకాశం ఉంది అని సమాచారం. చూడాలి మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: