టాలీవుడ్ సీనియర్ లెజెండరీ యాక్టర్ విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు పేరు ప్రపంచవ్యాప్తంగా ఎంత సుపరిచితమో మనకు అందరికీ తెలిసిందే. తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా చాటి, అందరితో అన్న గారుగా పిలిపించుకున్న ఎన్టీఆర్ గారు ప్రస్తుతం మన మధ్యన భౌతికంగా లేకున్నా, ఆయన చేసిన సినిమాలు, పోషించిన పాత్రలు ఎప్పటికీ తెలుగు వారి మదిలో గుర్తుంటాయి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరము లేదు. ఎన్టీఆర్ తరువాత ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ టాలీవుడ్ కి నటులుగా పరిచయం అవడం జరిగింది. 

IHG

లవకుశ సినిమాతో రామకృష్ణ, శ్రీకృష్ణావతారం తో హరికృష్ణ, అలానే తాతమ్మ కల సినిమాతో బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసారు. అయితే పూర్తి స్థాయి హీరోగా ఎన్టీఆర్ నటవారసత్వాన్ని కొనసాగించింది మాత్రం బాలకృష్ణ. కాగా హరికృష్ణ మధ్యలో అక్కడక్కడా సినిమాల్లో హీరోగా, అలానే మరి కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు. ఇకపోతే హరికృష్ణ తనయులైన కల్యాణరామ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమా రంగ ప్రవేశం చేసి ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పేరున్న హీరోలుగా కొనసాగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనంలో బాలరామాయణం సినిమాతో బాలనటుడిగా టాలీవుడ్ కి పరిచయం అయి, ఆపై కొంత గ్యాప్ తీసుకుని నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారారు. తొలిచూపులోనే సినిమాతో హీరోగా కళ్యాణ్ రామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

 

ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, నిన్న ప్రపంచ పితృ దినోత్సవం కావడంతో పలువురు నటులు తమ తండ్రులతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తూ వారికి పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితం కారు ప్రమాదంలో తండ్రి హరికృష్ణ మరణించడంతో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పూర్తిగా కృంగిపోయారు. ఇక నేడు పితృ దినోత్సవం సందర్భంగా పలువురు నందమూరి ఫ్యాన్స్ హరికృష్ణ ని గుర్తుచేసుకుంటూ తనయులిద్దరితో కలిసి ఆయన దిగిన ఫోటోలను వారు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తూ కొంత ఆవేదనతో కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: