పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ పై కరోనా మాత్రమే కాదు ప్రకృతి కూడా పూర్తిగా పగ పట్టిందా అన్న సంకేతాలు వస్తున్నాయి. ఈసినిమాను అత్యంత వేగంగా పూర్తిచేసి మే లో విడుదల చేద్దాం అనుకుంటే కరోనా అడ్డు తగిలిన విషయం తెలిసిందే. ఈసినిమా కోసం లాక్ డౌన్ ప్రకటనకు ముందు హైదరాబాద్ శివార్లలో కోటిన్నర ఖర్చు పెట్టి ఒక భారీ సెట్ వేసారు.


ఈలోపున లాక్ డౌన్ ప్రకటించడంతో షూటింగ్ లు ఆగిపోవడంతో ఆ భారీ సెట్ ఉపయోగించకుండానే వదిలివేయడం జరిగింది. ఈమధ్య హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు ఈసెట్ పూర్తిగా డ్యామేజ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ లు ప్రారంభం అవుతూ ఉండటంతో వకీల్ సాబ్ కు చెందిన ఈభారీ సెట్ ను ఇప్పుడు మళ్ళీ రిపేర్లు చేయవలసిన అవసరం ఉంది అని తెలుస్తోంది.


వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఈమూవీ షూటింగ్ కు సంబంధించి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా ఇప్పటికే పాడైపోయిన సెట్ ను రిపేర్లు చేయించకపోతే మరింతగా  సెట్ డ్యామేజ్ అయ్యేప్రమాదం ఉందని దిల్ రాజ్ భయపడుతున్నట్లు టాక్. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ మూవీ చిత్రీకరణ చివరకు వచ్చి ఆగిపోయిన పరిస్థితులలో దిల్ రాజ్ కు ఈమూవీ వల్ల సుమారు 30 కోట్లకు పైగా డబ్బు బ్లాక్ అయిందని ప్రచారం చర్చ జరుగుతోంది.


ఎప్పుడు ఈమూవీ షూటింగ్ పూర్తి అయి విడుదల అవుతుందో తెలియని ఈ సినిమాకు ఈ సెట్ రిపేర్ల నిమిత్తం మళ్ళీ దిల్ రాజ్ భారీగా ఖర్చు పెట్టవలసి వస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమాకు సంబంధించి కొన్ని కీలక సీన్స్ ఈసెట్ లో తీయవలసి ఉన్న పరిస్థితులలో ‘వకీల్ సాబ్’ ను ఒకవైపు కరోనా మరొక వైపు ప్రకృతి టార్చర్ పెడుతూ ఉండటంతో దిల్ రాజ్ కు ‘వకీల్ సాబ్’ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని టాక్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: