లాక్ డౌన్ ప్రారంభం ముందు ప్రకటింప బడ్డ అనేక సినిమాలలో నాని హీరోగా ‘టాక్సీ వాలా’ దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో ప్రకటింప బడ్డ ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ టైటిల్ చాల విభిన్నంగా ఉండటంతో ఈమూవీ ప్రారంభం కాకుండానే ఈమూవీ పై చాలఅంచనాలు ఏర్పడ్డాయి. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో కథ నడిచే సినిమా కావడంతో ఈమూవీ షూటింగ్ ను కలకత్తాలోనే ఎక్కువ భాగం షూట్ చేయాలని మొదట్లో భావించారు.


అయితే కరోనా సమస్యలు ఏర్పడటంతో ఈమూవీ షూటింగ్ ను ఇప్పట్లో కలకత్తా వెళ్ళి తీయడం జరగదు కనుక ఈమూవీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయినట్లే అని అందరు భావించారు. అయితే ఇప్పుడు ఈ మూవీ కోసం కలకత్తా సిటీ వాతావరణాన్ని పోలి ఉన్న ఒక భారీ సెట్ ను రామోజీ ఫిలిం సిటీలో వేస్తున్నట్లు టాక్. దీనితో నాని ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాలేదు అన్న లీకులు వస్తున్నాయి.


ఇది ఇలా ఉంటే ఈమూవీ కథ రీత్యా ముగ్గురు హీరోయిన్స్ అవసరం ఏర్పడటంతో ఈపాత్రాలను నటింపచేయడానికి రష్మిక రాశీ ఖన్నా సాయి పల్లవి నివేదా ధామస్ రీతు వర్మ నిధీ అగ్రవాల్ లో ఎవరో ఒక ముగ్గురి హీరోయిన్స్ డేట్స్ కోసం ఈమూవీ దర్శకుడు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. అయితే ఈమూవీ కథ రీత్యా ముగ్గురు హీరోయిన్స్ ఉండటంతో ఇలాంటి ప్రాజెక్ట్ లో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరుగా నటించడానికి పైన పేర్కొన్న క్రేజీ హీరోయిన్స్ ఎవరు ఆసక్తి కనపరచడం లేదు అని గాసిప్పులు వస్తున్నాయి.


దీనితో నాని రంగంలోకి దిగి ఈక్రేజీ బ్యూటీస్ తో తమకు ఉన్న పరిచయాల రీత్యా ఈమూవీలో నటించమని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నాని ఒత్తిడి రీత్యా దర్శకుడు చెప్పే కథను వినడానికి వీరంతా అంగీకరిస్తున్నా చివరకు ఈమూవీలోని తమ పాత్ర తమకు నచ్చలేదు అని కొందరు డేట్స్ ఎడ్జెస్ట్ కావడం లేదు అని మరికొందరు తప్పించుకునే వ్యూహంలో ఉన్నట్లు గాసిప్పులు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: