తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని ఆ తర్వాత లైఫ్ ను  సెటిల్ చేసుకున్న విషయం తెలిసిందే. కొంతమంది సినిమా చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులను పెళ్లి చేసుకుంటే ఇంకొంతమంది... బయట వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. అయితే ఇలా చిత్ర పరిశ్రమలో సినిమా లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే తన సహనటుడు మహేష్ బాబుతో ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకుంది నమ్రతా శిరోద్కర్. నమ్రత తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో క్రేజ్ సంపాదించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఎంతో మంది యువ హీరోల సరసన నటించింది నమ్రత. 

 


 తన అందం అభినయంతో కూడా ఎంతగానో ఆకర్షించింది. ఇక ఆ తర్వాత నాటి తరం సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబుతో ఓ సినిమాలో కలిసి నటించింది నమ్రత. ఇక ఆ సినిమాలో షూటింగ్లో భాగంగా ఆస్ట్రేలియాలో 30 రోజుల పాటు షూటింగ్ జరిగింది. ఇక ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలపడంతో... పెళ్లితో ఒక్కటయ్యారు ఈ జంట. ఘట్టమనేని కోడలు గా మారిపోయింది నమ్రతా శిరోద్కర్. అయితే నమ్రత పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమై పోయింది అని చెప్పాలి.  

 


 కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబును చూసుకోవడం లోనే ఒక బాధ్యతాయుతమైన భార్య గా ఉండిపోయింది. మహేష్ బాబు ఇంత సక్సెస్ సాధించడానికి నమ్రత పాత్ర కూడా ఎంతో కీలకం అని చెప్పాలి. ప్రతి మగాడి సక్సెస్ వెనక ఒక ఆడది ఉంటుంది అని చెప్పడానికి నమ్రత శిరోద్కర్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి. ప్రతి విషయంలో మహేష్ బాబు గురించి ఎంతో కేర్  తీసుకుంటూ... ఎప్పుడు ప్రోత్సహిస్తూ మహేష్ బాబు వెన్నంటే నడిచింది నమ్రత. ఇలా నమ్రత  స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నప్పటికీ ఘట్టమనేని కోడలు గా మారి తన లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: