టాలీవుడ్ లో ఇప్పుడు మంచి క్రేజ్ ఉన్న హీరోలు అందరూ కూడా వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ సినిమా విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరూ కూడా ఇప్పుడు పరిస్థితులను ఆధారంగా చేసుకుని సినిమాలు చేస్తున్నారు అనే చెప్పాలి. ఇక మన తెలుగులో మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ ఇప్పుడు పూర్తిగా కమర్షియల్ సినిమాల మీద ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. వీళ్ళు ఇప్పుడు కమర్షియల్ సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తల దిశగా అడుగులు వేస్తున్నారు. 

 

తమ సినిమాల్లో బాలీవుడ్ నటుల కోసం గానూ వారు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా  మహేష్ బాబు సర్కారు వారి పాట లో విలన్ గా అక్షయ్ కుమార్ ని అడిగాడు అని సమాచారం. అదే విధంగా మరో హీరో ఎన్టీఆర్ కూడా ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా తీసుకొచ్చే ఆలోచనలో భాగంగా కూడా ఆయన బాలీవుడ్ నటులను కావాలి అని అడిగినట్టు తెలుస్తుంది. సినిమా కమర్షియల్ గా ఉండాలి అంటే కచ్చితంగా వాళ్ళ అవసరం ఉంటుంది అని భావిస్తున్నారట. 

 

ఇక ప్రభాస్ ఎలాగూ బాలీవుడ్ హీరోయిన్ లను తన సినిమాలో తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అతను అక్కడి హీరోలతో  సినిమాలు చెయ్యాలి అని విలన్ గా కూడా ప్లాన్ చెయ్యాలి అని చూస్తున్నాడు. ఇప్పుడు ఇదే హిట్ మార్కెట్ అని ఆ విధంగా ఆలోచించి సక్సెస్ అవ్వడం మినహా మరి మార్గం లేదని వారు భావిస్తున్నారట. మరి అది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి. అంతే కాకుండా తమిళ హీరోల మీద కూడా ఎక్కువగానే ఫోకస్ చేసారు. మరి ఎవరి తో చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: