రైజింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన పెంగ్విన్ కొద్దీ రోజుల క్రితం డైరెక్ట్ గా అమేజాన్ ప్రైమ్ లో విడుదలైంది. టీజర్,ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడం తో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి అయితే సినిమా విడుదలైన తరువాత మాత్రం అంచనాలను అందుకోవడం కాదు కదా యావరేజ్ అని కూడా అనిపించుకోలేకపోయింది. కీర్తి నటన,సినిమాటోగ్రఫీ , బీజీఎమ్ మాత్రమే బాగున్నాయని సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇదే ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.
 
అయితే టీంఇండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం కొంచెం భిన్నంగా స్పందించాడు. పెంగ్విన్ గురించి పాజిటివ్ రివ్యూస్ విన్నాను అందుకే ఆదివారం రాత్రి సినిమా చూశాం. సినిమా లో కీర్తి నటన, బీజీఎమ్ బాగుందని అశ్విన్ ట్వీట్ చేశాడు. సినిమా గురించి పెద్దగా పొగడలేదు కానీ పాజిటీవ్ రివ్యూస్ అని అనడంతో నెటిజన్లకు కోపం వచ్చినట్లుంది.   
 
దాంతో సినిమా ప్రమోట్ చేయడానికి ఎంత తీసుకున్నావ్.. పాజిటీవ్ రివ్యూస్ ఎక్కడొచ్చాయి , అబద్దం చెప్పకు అశ్విన్ అంటూ కామెంట్లు  పెడుతున్నారు. దాదాపు అన్ని కామెంట్లు సినిమా బాగోలేదని వస్తున్నాయి. ఇక క్రిటిక్స్ కూడా సినిమాలో విషయం లేదని తేల్చేశారు. మొత్తానికి మంచి హైప్ మధ్య విడుదలైన ఈచిత్రం ఉసూరుమనిపించింది అయితే నిర్మాతలు మాత్రం తెలివిగా ఓటిటికి అమ్ముకొని సేఫ్ అయ్యారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: